
Eenadu•28 Oct 2026
మోదీ మీడియా సమావేశం ఎందుకు పెట్టరుభారత విదేశాంగ శాఖ అధికారులకు న్యూజిలాండ్లో ఆసక్తికర ప్రశ్న ఎదురైంది. ప్రధాని మోదీ మీడియా సమావేశం ఎందుకు పెట్టరు అని జర్నలిస్టులు ప్రశ్నించగా.. అందుకు అధికారులు స్పందించారు. ‘‘సాధారణంగా, భారత్లో రాజకీయ నాయకులు ఓటర్లతో ప్రత్యక్షంగా మాట్లాడటానికే ప్రాధాన్యతనిస్తారు. భారతీయ ఓటర్లలో అత్యధికులు గ్రామీణ ప్రాంతాలకు చెందినవారు. వారు ప్రత్యక్ష సంప్రదింపులనే కోరుకుంటారు. మధ్యవర్తుల ద్వారా సంభాషించడం వారికి నచ్చదు. ఓటర్లతో ప్రత్యక్షంగా మాట్లాడటంలో మోదీ ముందుంటారు’’ అని పేర్కొన్నారు. ప్రస్తుతం మోదీ న్యూజిలాండ్లో పర్యటిస్తున్నారు. ‘మోదీ మీడియా సమావేశం ఎందుకు పెట్టరు?’