
రోజురోజుకూ పెంపుడు జంతువులు పెంచుకునే వారి సంఖ్య పెరుగుతోంది. పిల్లల నుంచి పెద్దల వరకు ప్రతి ఒక్కరూ కుక్కలు, పిల్లులను, కుందేళ్లను, చిలుకలును పెంచుకోవడానికి ఇష్టపడతున్నారు. వాటితో ఆడుకోవడం, ఫొ టోలు దిగడం. సరదాగా బయటకు తీసుకెళ్తూ ఎంజాయ్ చేస్తున్నారు. కొన్ని సందర్భాల్లో వాటిని ము ద్దాడుతూ సంబరపడిపోతుంటారు. అయితే పెట్స్ పెంచుకునే వాళ్లు చాలా జాగ్రత్తలు తీసుకోవాలని.. వాటిన వల్ల మనకు వ్యాధులు వ్యాపించే ప్రమాదం ఉందని నిపుణులు చెబుతున్నారు. జూలై 6వ తేదీని ప్రపంచవ్యాప్తంగా జూనోసిస్ డే సందర్భంగా జంతువుల నుంచి మనుషులకు సోకే వ్యాధులు తీసుకోవాల్సిన జాగ్రత్తలను మంచిర్యాల జిల్లా పశుసంవర్థక శాఖ అధికారి యాకుబ్రెడ్డి తెలిపారు. జూనోసిస్ వ్యాధులు అంటే.. జంతువుల నుంచి మనుషులకు సంక్రమించే వ్యాధులను జూనోసిస్ వ్యాధులు అంటారు. పశువులు, కుక్కలు, పిల్లులు, పక్షులు, కోళ్లు వంటి జంతువుల నుంచి మనుషులకు సుమారు 200 రకాల వ్యాధులు సోకే అవకాశం ఉంది. పశువుల పాకల అపరిశుభ్రత, సరైన జాగ్రత్తలు లేకపోవడం వంటి కారణాలతో ఈ వ్యాధులు వ్యా ప్తి చెందుతాయి. ఈ రోజు పశుపోషకులు, పెంపుడు జంతువుల ప్రేమికులు అప్రమత్తంగా ఉండాలని, అవగాహన కల్పించాలని జిల్లా పశుసంవర్థక శాఖ అధికారులు సూ చిస్తున్నారు. అప్రమత్తం కోసం జూనోసిస్ డే 1885వ సంవత్సరం జూలై 6వ తేదీన ఫ్రెంచ్ శాస్త్రవేత్త లూయిస్ పాశ్చర్ చరిత్రాత్మకమైన ప్రయోగం చేశారు. పిచ్చి కుక్క కరిచిన ఒక బాలుడికి ఆయన మొదటిసారిగా రేబిస్ వ్యాధి నివారణ టీకా ఇచ్చారు. ఆ ప్రయత్నం విజయవంతం కావడంతో జూలై 6న ప్రపంచ జూనోసిస్ దినోత్సవంగా పాటించడం ప్రారంభమైంది. ఈ రోజు జంతువుల నుంచి వచ్చే వ్యాధుల నివారణపై విస్తృత అవగాహన కల్పించడం, అప్రమత్తం చేయడం, టీకాల ప్రాముఖ్యతను తెలియజేయడం ఈ రోజు ప్రత్యేకత. తీసుకోవాల్సిన జాగ్రత్తలు.. పెంపుడు కుక్కలను శాస్త్రీయ పద్ధతిలో, పశువైద్యుని సలహా మేరకు పెంచకపోతే వాటి నుండి వచ్చే వ్యాధులు ప్రాణాంతకంగా