
భూగోళంపై జీవం ఉట్టిపడటానికి, ప్రకృతి సమతౌల్యతతో సాగడానికి మూలాధారం ‘జీవ వైవిధ్యం’. ఈ సృష్టిలోని ప్రతి చిన్న ప్రాణి నుంచి భారీ వృక్షాల వరకు అన్నీ ఒకదానిపై ఒకటి ఆధారపడి జీవిస్తుంటాయి. ఆ అపురూపమైన జీవజాలాన్ని, వాటి సహజ ఆవాసాలనూ కాపాడుకోవడానికి ప్రపంచ వ్యాప్తంగా ఏర్పాటైనవే ‘రక్షిత ప్రాంతాలు’. ప్రకృతి ప్రసాదించిన అద్భుత వైవిధ్యాన్ని, అంతరించిపోతున్న వృక్ష, జంతు జాతులను సంరక్షించుకునే లక్ష్యంతో నిర్వహించే రియో డి జెనీరో లాంటి అంతర్జాతీయ సదస్సుల నుంచి నిన్నమొన్నటి ‘కున్నింగ్-మాంట్రియల్ ఫ్రేమ్వర్క్’ వరకు ప్రపంచ దేశాలు తీసుకుంటున్న నిర్ణయాలు, రెడ్ డేటా బుక్ విశేషాలు అత్యంత కీలకం. అదే విధంగా తెలుగు రాష్ట్రాల్లోని కోరంగి మడ అడవులు, శేషాచలం, కవ్వాల్ తదితర స్థానిక రక్షిత ప్రాంతాలకూ ప్రాముఖ్యత ఉంది. వీటన్నింటి గురించి పోటీ పరీక్షార్థులు తెలుసుకోవాలి. అడవుల కోసం ప్రాణాలర్పించిన ‘చిప్కో’ ఉద్యమ నేతల స్ఫూర్తితో పాటు, వన్యప్రాణుల గణన కోసం నేడు వాడుతున్న ‘ఏఐ కెమెరా ట్రాపింగ్’ మొదలైన అధునాతన సాంకేతికతలపై అవగాహన పెంచుకోవాలి. పర్యావరణ పరిరక్షణలో గిరిజనుల పాత్రను గుర్తిస్తూనే, జీవ వైవిధ్యాన్ని సంరక్షించాల్సిన ఆవశ్యకతను అర్థం చేసుకోవాలి. 1. శిఖరాగ్ర సమావేశం రియో డీ జెనీరో-1992 ప్రకారం భూమి, జలావరణంలో కనిపించే జీవుల మధ్య ఉండే వైవిధ్యాన్ని ‘జీవ వైవిధ్యం’ అంటారు. ఈ పదాన్ని ప్రతిపాదించినవారు? 1) ఎల్టర్ 2) రోసెన్ 3) రీటర్ 4) జాన్ రే 2. కింది వాటిని జతపరచండి. ఎ బి ఎ) అంతర్జాతీయ జీవ వైవిధ్య దినోత్సవం 1) 20112020 బి) జీవవైవిధ్య దశాబ్దం 2) 2010 సి) జీవవైవిధ్య సంవత్సరం 3) 2002 డి) జీవవైవిధ్య చట్టం 4) మే 22 1) ఎ-1; బి-2; సి-3; డి-4 2) ఎ-2; బి-3; సి-4; డి-1 3) ఎ-4; బి-1; సి-2; డి-3 4) ఎ-4; బి-1; సి-3; డి-2 3. ఏపీలో ఉండే