
మహిళల ఆర్థిక సాధికారతే కుటుంబాల అభ్యున్నతికి మార్గమని సీఎం చంద్రబాబు అన్నారు. మహిళల ఆదాయం పెరగాలని, ప్రతి ఒక్కరి ఆరోగ్యం బాగుండాలని ఆయన ఆకాంక్షించారు. తీసుకున్న ప్రతి రూపాయీ చెల్లిస్తున్నారు.. ‘స్త్రీ శక్తి’ మిగులుతో వ్యాపారాలు చేస్తున్నారు మహిళా సాధికారతకు నాడు డ్వాక్రా తెచ్చాం.. కుటుంబాల అభ్యున్నతికి మార్గం వేశాం పథకాలను సద్వినియోగం చేసుకోండి.. ఆర్థికంగా ఎదగండి రాజకీయ ముసుగులో ఉండే నేరగాళ్లను ఓ కంట కనిపెట్టండి.. సీఎం పిలుపు ‘స్త్రీ శక్తికి సంవత్సరం.. రెట్టింపైన ఆత్మవిశ్వాసం’ పేరుతో రాష్ట్రవ్యాప్త కార్యక్రమాలు మహిళలతో కలిసి బస్సు ప్రయాణం.. సీఎం క్యాంపు కార్యాలయంలో మాటామంతి ప్రభుత్వ పథకాలు అందుతున్నాయన్న సంతృప్తితో ఆగిపోవద్దు. వాటిని ఆధారం చేసుకుని ఆదాయాన్ని పెంచుకోవాలి. ఉద్యోగాలు, వ్యాపారాలు, స్వయం ఉపాధి రంగాల్లో మరింతగా రాణించాలి. గంజాయి నిర్మూలనకు డ్వాక్రా సంఘాలు చొరవ తీసుకోవాలి. రాజకీయ ముసుగులో నేరాలకు పాల్పడేవారిని మహిళలు ఒక కంట కనిపెడుతూ ఉండాలి. రాజకీయాలను అడ్డం పెట్టుకుని సమాజంలో అశాంతి సృష్టించే వారిని దూరంగా పెట్టే చైతన్యం ప్రతి ఒక్కరిలోనూ రావాలి. అమరావతి, ఆగస్టు 15(ఆంధ్రజ్యోతి) : మహిళల ఆర్థిక సాధికారతే కుటుంబాల అభ్యున్నతికి మార్గమని సీఎం చంద్రబాబు అన్నారు. మహిళల ఆదాయం పెరగాలని, ప్రతి ఒక్కరి ఆరోగ్యం బాగుండాలని ఆయన ఆకాంక్షించారు. పేద, మధ్యతరగతి కుటుంబాల స్థితిగతులను తెలుసుకుని, బాగా వెనుకబడిన కుటుంబాలను ప్రత్యేక శ్రద్ధతో ముందుకు తీసుకెళ్లేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు. ఏడాది కాలంలో రూ.87 కోట్ల ఉచిత ప్రయాణాలు జరిగాయని తెలిపారు. రోజుకు సుమారు 27 లక్షల ప్రయాణాలు జరుగుతున్నాయని చెప్పారు. స్త్రీ శక్తి పథకం ద్వారా ఆదా చేసుకున్న డబ్బును కుటుంబ అవసరాలకు, వ్యాపారాలకు మహిళలు వినియోగించుకుంటున్నారని తెలిపారు. స్త్రీ శక్తి పథకం వల్ల మహిళలకు ప్రయాణ స్వేచ్ఛతోపాటు ఆర్థిక స్వాతంత్య్రం, ఆత్మవిశ్వాసం కూడా పెరిగాయన్నారు. స్త్రీ శక్తి పథకం ప్రారంభించి ఏడాది పూర్తయిన సందర్భంగా ‘స్త్రీ శక్తికి సంవత్సరం.. రెట్టింపైన ఆత్మవిశ్వాసం’