
ప్రపంచ వాణిజ్యానికి అత్యంత కీలకమైన హర్మూజ్ జలసంధి మరో సారి యుద్ధరంగంగా మారింది. అంతర్జాతీయ చమురు సరఫరాకు అత్యంత కీలకమైన ఈ జల మార్గంలో ఉద్రిక్తతలు మళ్లీ పీక్స్ కు చేరాయి. నౌకలపై దాడులను నిలిపివేసేలా అమెరికా, ఇరాన్ దేశాల మధ్య ఇటీవల కుదిరిన శాంతి ఒప్పందం ముక్కలైంది. ఆ ఒప్పందాన్ని బేఖాతరు చేస్తూ.. ఇరాన్ దళాలు క్షిపణులతో విరుచుకుపడ్డాయి. ఈ పరిణామం మళ్లీ ఒక్కసారిగా శాంతి ఆశలను ఆవిరి చేసేసింది. ఒమన్ తీరానికి సమీపంలో ఇరాన్ రివల్యూషనరీ గార్డ్స్ కార్ప్స్ రెండు వాణిజ్య నౌకలను లక్ష్యంగా క్షిపణి దాడులకు తెగబడింది. ఈ దాడుల కారణంగా ఆ రెండు వాణిజ్య నౌకలు పాక్షికంగా ధ్వంసమయ్యాయి. అమెరికా, ఇరాన్ మధ్య కుదిరిన శాంతి ఒప్పందం ఇంత స్వల్ప వ్యవధిలో అంటే రోజుల వ్యవధిలోనే పటాపంచలైంది. ఒప్పందాన్ని తుంగలో తొక్కుతూ ఇరాన్ దూకుడుకు కారణమేంటన్నది వెంటనే తెలియరాలేదు. అయితే ఇరాన్ జరిపిన ఈ క్షిపణి దాడులపై అమెరికా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ ప్రాంతంలో శాంతి భద్రతలను పునరుద్ధరించడానికి, వాణిజ్య నౌకలకు రక్షణ కల్పించడానికి అమెరికా తదుపరి ఎలాంటి కఠిన అడుగులు వేయబోతుందనేది ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా ఉత్కంఠ రేపుతోంది. ఈవీ, సెమీకండక్టర్ హబ్ గా ఏపీ.. దక్షిణ కొరియాలో మంత్రి నారా లోకేష్ కీలక ఒప్పందాలు. !