.webp)
ప్రశ్నించే జర్నలిస్టులపై కేసులు..ఏపీలో మాయమవుతున్న పత్రికా స్వేచ్ఛ..! ఆంధ్రప్రదేశ్ రాజకీయం ఇవాళ ఒక విచిత్రమైన సంక్షోభంలో కూరుకుపోయింది. వీధుల్లో రాజకీయం వేడిగా, రచ్చరచ్చగా కనిపిస్తున్నప్పటికీ... అది ప్రజల కడుపు నింపేది కాదు, వారి సమస్యలను తీర్చేది అంతకన్నా కాదు. ఒకప్పుడు అభ్యుదయ భావాలకు, పోరాటాలకు, చైతన్యవంతమైన మేధో చర్చలకు నిలయమైన ఆంధ్ర నేలలో... ఈరోజు భయం, నిస్తేజత, ఒకరకమైన అచేతన నిశ్శబ్దం ఆవహించాయి. ఊళ్లలో, నగరాల్లో సగటు సామాన్యుడి మనస్సులో మెదులుతున్న అతి పెద్ద ఆందోళన.. రిటైర్డ్ ఐపీఎస్ అధికారి ఏబీ వెంకటేశ్వరరావు సంచలన వ్యాఖ్యలు చేశారు. టివి తెరలు తెరుచుకుంటే చాలు... ఉదయం నుంచి సాయంత్రం వరకు ఏదో ఒక రాజకీయ సర్కస్, రాత్రికి ఛానళ్లలో వేడివేడి చర్చలు. ప్రజలకు వినోదం పంచే రంగుల వెలుగుల వెనుక దాగిన చేదు నిజం ఏమిటంటే... అధికారం, ప్రతిపక్షం అని చెప్పుకుంటున్న ప్రధాన శక్తులు పైకి కొట్టుకుంటున్నట్టు నటిస్తూ, తెర వెనుక మాత్రం ఎంతో కలిసిమెలిసి పనిచేసుకుంటున్నాయి. నాటకీయ విమర్శలతో ప్రజల దృష్టిని మళ్లిస్తూ, తమ రాజకీయ ప్రయోజనాలను నెరవేర్చుకుంటున్నాయి. ఇటు యువతకు ఉద్యోగాలు లేక, రైతులకు గిట్టుబాటు ధర దొరక్క, సామాన్యుడిపై ధరల భారం పడుతుంటే... ఈ నిత్య నాటకాలు ప్రజల అసలు సమస్యలను పక్కదారి పట్టిస్తున్నాయి. ప్రజాస్వామ్యంలో ప్రజల తరఫున నిలబడి ప్రశ్నించాల్సిన ప్రతిపక్ష పాత్రే మాయమైపోతే, సామాన్యుడు తన బాధను ఎవరికి చెప్పుకోవాలి? మరోవైపు భయానకమైన పత్రికా స్వేచ్ఛా హరణం జరుగుతోంది. సమాజంలో జరుగుతున్న అక్రమాలను, అన్యాయాలను ప్రశ్నించే స్వతంత్ర జర్నలిస్టులు, యూట్యూబర్లు ఇవాళ తీవ్ర భయాందోళనల మధ్య బతుకుతున్నారు. ఏదైనా నిజం చెబితే ఎక్కడ తప్పుడు కేసులు పెడతారో, ఎప్పుడు పోలీసు స్టేషన్ల చుట్టూ తిప్పుతారో అనే భయంతో వణికిపోతున్నారు. బహిరంగంగా నడిచే అక్రమాలు, సహకార సంస్థల నాయకులపై జరిగే రాజకీయ ఒత్తిళ్లు, బలవంతపు రాజీనామాల వార్తలను కూడా ప్రధాన పత్రికలు నిర్భయంగా ప్రచురించలేకపోతున్నాయి. సత్యాన్ని నిలబెట్టాల్సిన పత్రికలు, ఛానళ్లు