
భోగాపురం ఎయిర్పోర్టుకు మెట్రో అనుసంధానం అత్యవసరమన్న నీతిఆయోగ్ 2030 నాటికి 77 కిలోమీటర్ల లైన్ పూర్తి కావాలని స్పష్టీకరణ గ్లోబల్ బెంచ్మార్క్ ప్రకారం విశాఖకు 150 కిలోమీటర్ల నెట్వర్క్ అవసరం ముందుచూపు లేనివాడికి ముంగిట్లోనే ముప్పు అన్నట్లుంది విశాఖ మెట్రో నిర్లక్ష్యం. ఒకవైపు అంతర్జాతీయ విమానాశ్రయం రన్వే సిద్ధమవుతుంటే.. అక్కడికి వెళ్లే శాశ్వత రవాణా మార్గం మాత్రం పడకేసింది. భోగాపురానికి ‘వైజాగ్ మెట్రో’ అనుసంధానం అత్యవసరమని సాక్షాత్తూ ‘నీతిఆయోగ్’ మాస్టర్ప్లాన్ హెచ్చరిస్తున్నా.. కూటమి సర్కారు మాత్రం డీపీఆర్లను కాగితాలు దాటించడం లేదు. మెట్రో పట్టాలెక్కకపోతే.. భోగాపురం ప్రయాణం భవిష్యత్తులో నరకప్రాయమైన ‘ట్రాఫిక్ పద్మవ్యూహం’ కావడం ఖాయమని నిపుణులు హెచ్చరిస్తున్నారు. సాక్షి, విశాఖపట్నం: ఉత్తరాంధ్ర ప్రజల ఎన్నో ఏళ్ల కలగా రూపుదిద్దుకున్న భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం అందుబాటులోకి వచ్చే వేళ.. దానికి నగరం నుంచి సమర్థవంతమైన ప్రజారవాణా అనుసంధానం లేకపోవడం ప్రధాన ఆందోళనగా మారింది. వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో శంకుస్థాపన జరిగి వేగంగా నిర్మాణం పూర్తిచేసుకున్న ఈ విమానాశ్రయం ప్రాంతీయ అభివృద్ధికి కీలక మైలురాయిగా నిలవనుంది. అయితే విమానాశ్రయానికి వేలాది మంది ప్రయాణికులు సులభంగా చేరుకునేలా వైజాగ్ మెట్రోను పూర్తి చేయాల్సిన అవసరాన్ని కేంద్ర ప్రభుత్వ సంస్థ అయిన నీతిఆయోగ్ సైతం స్పష్టంగా ప్రస్తావించినా.. రాష్ట్ర ప్రభుత్వం మాత్రం ఇప్పటికీ కార్యాచరణలో వేగం చూపడం లేదన్న విమర్శలు వ్యక్తమవుతున్నాయి. 2030 లక్ష్యం.. ప్రస్తుతం సున్నా.. ఇటీవల విడుదలైన ’విశాఖపట్నం ఎకనమిక్ రీజియన్ గ్రోత్ హబ్ మాస్టర్ప్లాన్’లో నీతిఆయోగ్ విశాఖ నగర భవిష్యత్ రవాణా అవసరాలపై స్పష్టమైన దిశానిర్దేశం చేసింది. 2028–2030 మధ్యకాలంలో కనీసం 77 కి.మీ మెట్రో నెట్వర్క్ను పూర్తి చేయాలని సూచించింది. అయితే ప్రస్తుతం నగరంలో ఒక్క కిలోమీటరు మెట్రో మార్గం కూడా అందుబాటులో లేకపోవడాన్ని నివేదిక ప్రస్తావించింది. అంతేకాదు.. ప్రపంచ స్థాయి ప్రమాణాలను పరిశీలిస్తే విశాఖ పరిమాణంలోని నగరానికి 100 నుంచి 150 కిలోమీటర్లకు పైగా మెట్రో నెట్వర్క్ అవసరమని పేర్కొంది. భవిష్యత్