
ప్రముఖ బాలీవుడ్ నటులు షారుఖ్ ఖాన్, అజయ్ దేవగణ్, టైగర్ ష్రాఫ్లు నటించిన ‘విమల్ ఇలాచీ’ ప్రకటన తీవ్ర వివాదంలో చిక్కుకుంది. ఈ యాడ్ ద్వారా నిషేధిత పాన్ మసాలాను పరోక్షంగా ప్రచారం చేస్తున్నారని ఆరోపిస్తూ మహారాష్ట్ర ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ (ఎఫ్డీఏ) వారికి షోకాజ్ నోటీసులు జారీ చేసింది. ఈ కేసులో వారిచ్చే సమాధానం సంతృప్తికరంగా లేకుండా ఒక్కొక్కరికి రూ. 10 లక్షల వరకు జరిమానా విధించే అవకాశం ఉంది. కాగా, ఈ పరిణామం ‘సరోగెట్ అడ్వర్టైజింగ్’ (పరోక్ష ప్రకటనలు) కేసులలో సెలబ్రిటీల చట్టపరమైన బాధ్యతపై కొత్త చర్చకు దారితీసింది.మహారాష్ట్రలో 2026 జులై నుంచి పాన్ మసాలా తయారీ, అమ్మకం, నిల్వపై నిషేధం అమల్లో ఉంది. అయితే, ‘విమల్ ఇలాచీ’ పేరుతో వస్తున్న ప్రకటన, పాన్ మసాలాను గుర్తుచేసేలా ఉందని ఎఫ్డీఏ అభిప్రాయపడింది. ఆగస్టు మధ్యలో జారీ చేసిన ఈ నోటీసుల్లో, సదరు యాడ్ నుంచి తప్పుకోవాలని, సోషల్ మీడియా నుంచి దానికి సంబంధించిన కంటెంట్ను తొలగించాలని నటులను ఆదేశించింది. 15 రోజుల్లోగా తమ వివరణతో పాటు, ఎండార్స్మెంట్ ఒప్పంద వివరాలను కూడా సమర్పించాలని స్పష్టం చేసింది.ఈ చర్యను ఎఫ్డీఏ కమిషనర్ తుకారాం ముండే గట్టిగా సమర్థించారు. ఆహార భద్రత, ప్రమాణాల (ఎఫ్ఎస్ఎస్) చట్టం ప్రకారం ప్రకటనల గొలుసులో భాగమైన తయారీదారులు, ప్రచురణకర్తలు, స్పాన్సర్లు, ప్రచారకర్తలు అందరూ బాధ్యులేనని ఆయన అన్నారు. "ఈ విషయంలో ఎవరినీ వదిలిపెట్టే ప్రసక్తే లేదు" అని ఆయన హెచ్చరించారు. వారిచ్చే సమాధానం సంతృప్తికరంగా లేకపోతే, మొదటి దశలో రూ