బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం వాయుగుండంగా బలపడింది.. పశ్చిమబెంగాల్, ఉత్తర ఒడిశాకు ఆనుకొని వాయవ్య బంగాళాఖాతంలో ఉత్తర వాయవ్యంగా పయనించి జార్ఖండ్ వైపుగా వెళుతుందని వాతావరణ శాఖ తెలిపింది. ఈ కారణంగా రానున్న 24 గంటల్లో కోస్తా, రాయలసీమలో వర్షాలు కురవనున్నాయి. ఏపీలో నేటి నుంచి 23 వరకు 6 రోజులు పాటూ పలు జిల్లాల్లో తేలికపాటి వర్షాలు పడతాయని అంచనా వేస్తున్నారు. ఇవాళ కొన్ని ప్రాంతాల్లో తేలికపాటి వర్షాలు పడే అవకాశం ఉంది అటున్నారు. అలాగే గంటకు 40-50 కి.మీ. వేగంతో ఈదురుగాలులు వీస్తాయని చెబుతున్నారు. తీర ప్రాంత ప్రజలు, మత్స్యకారులు అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు. సముద్రం అల్లకల్లోలంగా ఉండే అవకాశం ఉందని.. ఆగస్టు 19 వరకు చేపల వేటకు వెళ్లొద్దని అధికారులు సూచించారు.అల్లూరి సీతారామరాజు జిల్లా హుకుంపేట, పెదబయలులో సోమవారం భారీ వాన పడింది. పాడేరు, పరిసర ప్రాంతాల్లో తేలికపాటి జల్లులు కురిశాయి. ఇటు ఒడిశాకు సరిహద్దు ప్రాంతాలైన ముంచంగిపుట్టుజి.మాడుగుల, , పెదబయలు, జీకేవీధి మండలాల్లో ఒక మోస్తరు వర్షం పడింది. హుకుంపేటలో మూడు గంటల పాటూ భారీ వాన కురిసింది. పెద్ద బయలులోనూ భారీ వర్షం పడింది. కొన్ని చోట్లో మట్టి రోడ్లు కావడంతో వాహనదారులు ఇబ్బందిపడ్డారు. ఈ భారీ వర్షానికి కొన్ని ప్రాంతాల్లో పంట పొలాల్లోకి నీరు వచ్చి చేరింది. ఈ వర్షాలు ఖరీఫ్ పంటల సాగుకు మేలు చేస్తాయని రైతులు భావిస్తున్నారు.ఆంధ్రప్రదేశ్పై ఎల్నినో ప్రభావం కనిపిస్తోంది. నైరుతు రుతుపవనాలు సమయానికి వచ్చినా సరే వర్షాలు మాత్రం పెద్దగా పడలేదు. బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనాలు, ద్రోణులు, అల్పపీడనాలు, వాయుగుండాలు ఏర్పడినా ఇప్పటి వరకు సరైన వానలు కురవలేదు. దీంతో రైతులు ఆందోళనలో ఉన్నారు.. వర్షాల కోసం ఎదురు చూస్తున్నారు. అక్కడక్కడా వర్షాలు పడినా ఉపయోగం లేకుండా పోయిందంటున్నారు. అలాగే ఏపీ ప్రభుత్వం రైతులు ప్రత్యామ్నాయ పంటల్ని సాగు చేయాలని అవగాహన కల్పించింది. మొత్తం మీద ఏపీలో ఈ ఏడాది వర్షాలు
Actor ProfilePolitician
బంగాళాఖాతంలో వాయుగుండం ఎఫెక్ట్.. ఏపీలోని ఈ జిల్లాల్లో వర్షాలు
📊 Box Office Collections
Total News1
Movie Updates0
Sources1
Samayam Telugu•6 Jan 2027
బంగాళాఖాతంలో వాయుగుండం ఎఫెక్ట్.. ఏపీలోని ఈ జిల్లాల్లో వర్షాలు