
రైల్వే క్రాసింగ్ వద్ద ఓ వ్యక్తి ఫోన్ కాల్తో రైలును ఆపిన ఘటన సోషల్ మీడియాలో వైరల్గా మారింది. తన కుటుంబ సభ్యులను రైలు ఎక్కించేందుకు వచ్చిన అతను.. స్టేషన్కు వెళ్లక ముందే దానిని ఆపేయడం ఇప్పుడు హాట్ టాపిక్గా మారింది. బిహార్: రైల్వే క్రాసింగ్ వద్ద ఓ వ్యక్తి ఫోన్ కాల్తో రైలును ఆపిన ఘటన సోషల్ మీడియాలో వైరల్గా మారింది. తన కుటుంబ సభ్యులను రైలు ఎక్కించేందుకు వచ్చిన అతను.. స్టేషన్కు వెళ్లక ముందే దానిని ఆపేయడం ఇప్పుడు హాట్ టాపిక్గా మారింది. దీంతో రైల్వే క్రాసింగ్ వద్ద వేచి ఉన్న వాహనదారులు ఆశ్చర్యానికి గురయ్యారు. అదేదో బస్సునో, ఆటోనో ఆపినట్లు రైలును ఆపడంతో షాక్ అయ్యారు. ఈ ఘటన బిహార్లో జరగగా.. దీనికి సంబంధించిన వీడియో నెట్టింట చక్కర్లు కొడుతోంది. ఈ వీడియోను @SitamarhiJila అనే ఎక్స్ అకౌంట్ యూజర్ పోస్టు చేశాడు. వైరల్ అవుతున్న వీడియో ప్రకారం.. ఓ రైల్వే క్రాసింగ్ వద్ద సిగ్నల్ పడింది. దీంతో పట్టాలకు ఇరువైపులా పదుల సంఖ్యలో వాహనాలు నిలిచాయి. ఇదే సమయంలో ఓ వ్యక్తి తన కుటుంబ సభ్యులతో కలిసి ప్రభుత్వ వాహనంలో అక్కడికి వచ్చాడు. నేరుగా రైల్వే లైన్ వద్దకు వెళ్లాడు. అదే సమయంలో అటుగా ప్యాసింజర్ రైలు వస్తోంది. ఇంతలో ఆ వ్యక్తి ఫోన్లో ఎవరితోనో మాట్లాడుతున్నట్లు కనిపించింది. అనంతరం రైలును ఆపాలంటూ చేతితో సైగ చేశాడు. కొద్దిసేపటికే రైలు వచ్చి వారి వద్ద ఆగింది. అతను తన కుటుంబ సభ్యులను ఎక్కించడంతో తిరిగి రైలు వెళ్లిపోయింది. దీంతో వీడియో తీస్తున్న వ్యక్తితో పాటు అక్కడున్న వారంతా ఆశ్చర్యం వ్యక్తం చేశారు. ఆ వీడియోను కాస్తా సోషల్ మీడియాలో పోస్టు చేయగా.. రైల్వే సేవా అధికారిక ఖాతా స్పందించింది. ఈ ఘటనను సమస్తిపూర్ డివిజన్ అధికారుల దృష్టికి తీసుకెళ్లినట్లు పేర్కొంది. దీనిపై సంబంధిత అధికారులు దర్యాప్తు చేపట్టినట్లు తెలుస్తోంది