
వరల్డ్ ఫొటోగ్రఫీ డే సందర్భంగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఫొటో జర్నలిస్ట్గా మారారు. ఫొటో జర్నలిస్ట్లు అందరిని కలిపి సీఎం గ్రూప్ ఫొటో తీశారు. కెమెరా తీసుకుని తానే ఫొటో తీస్తానని చెప్పారు. అమరావతి, ఆగస్టు 19 (ఆంధ్రజ్యోతి): వరల్డ్ ఫొటోగ్రఫీ డే సందర్భంగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు (AP CM Chandrababu Naidu) ఫొటో జర్నలిస్ట్గా మారారు. ఫొటో జర్నలిస్ట్లు అందరిని కలిపి సీఎం గ్రూప్ ఫొటో తీశారు. కెమెరా తీసుకుని తానే ఫొటో తీస్తానని చెప్పారు. వరల్డ్ ఫోటోగ్రఫీ దినోత్సవం సందర్భంగా అసెంబ్లీ ప్రాంగణంలో ముఖ్యమంత్రి చంద్రబాబును ఫొటో జర్నలిస్ట్లు ఈరోజు (బుధవారం) కలిశారు. ఈ సందర్భంగా ఫొటో జర్నలిస్టులకు శుభాకాంక్షలు తెలిపారు. ఫొటోగ్రాఫర్లను కలవడం ఎంతో గౌరవంగా భావిస్తున్నా: సీఎం చరిత్రను నమోదు చేస్తూ.. జ్ఞాపకాలను పదిలపరుస్తున్న ఫొటోగ్రాఫర్లకు సీఎం అభినందనలు తెలిపారు. మానవ అనుభవాలను, అద్భుతమైన చిత్రాలుగా ఆవిష్కరిస్తున్న ఫొటోగ్రాఫర్లకు శుభాకాంక్షలు చెప్పారు. మీడియా, ప్రొఫెషనల్ ఫొటోగ్రాఫర్లను కలవడం ఎంతో గౌరవంగా భావిస్తున్నానని పేర్కొన్నారు. ఫొటోగ్రాఫర్ల అంకితభావం, కళాత్మకత, నిరంతర కృషి అభినందనీయమని ప్రశంసించారు. ప్రతి ఫొటో ఓ మధురమైన ఘట్టాన్ని పదిలపరుస్తుంది.. ఎన్నో చెప్పని కథలకు ఫొటోగ్రాఫర్లు తమ చిత్రాల ద్వారా గొంతుకనిస్తున్నారని సీఎం వ్యాఖ్యానించారు. ప్రతి ఫొటో భవిష్యత్తు తరాల కోసం కాలంలోని ఓ మధురమైన ఘట్టాన్ని పదిలపరుస్తుందని వివరించారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఫొటోగ్రాఫర్లకు సీఎం చంద్రబాబు శుభాకాంక్షలు తెలిపారు. ప్రజలకు సమాచారం, స్ఫూర్తి అందించేలా చిరస్థాయిగా నిలిచే క్షణాలను మరింతగా బంధించాలని ఆకాంక్షించారు. ఈ మేరకు ఎక్స్లో సీఎం చంద్రబాబు పోస్టు పెట్టారు. 55కు పైగా అజెండా అంశాలతో ఏపీ క్యాబినెట్ భేటీ నిర్మలా సీతారామన్ నాయకత్వంలో భారత్ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఎదిగింది: పవన్