
ఇంటర్నెట్ డెస్క్: బెంగాల్ మాజీ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ సన్నిహితుడు, మాజీ డిప్యూటీ స్పీకర్ ఆశిష్ బెనర్జీ (Asish Banerjee) ఆత్మహత్య చేసుకున్నారు. ఆదివారం తెల్లవారుజామున బీర్భూమ్ జిల్లాలోని పార్టీ కార్యాలయం (Trinamool office)లో ఉరివేసుకుని బలవన్మరణానికి పాల్పడ్డారు. ఆయన ఇంటికి సమీపంలోనే పార్టీ కార్యాలయం ఉంది. పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టానికి పంపి ఘటనపై దర్యాప్తు చేపట్టారు. తృణమూల్ నేత మృతి విషయం తెలుసుకున్న పార్టీ కార్యకర్తలు, ప్రజలు పెద్ద ఎత్తన పార్టీ కార్యాలయం వద్దకు చేరుకున్నారు. ఆశిష్ బెనర్జీ రాంపూర్హాట్ నియోజకవర్గం నుంచి ఐదుసార్లు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. 2001 నుంచి 2026 వరకు 25 ఏళ్లపాటు ఆ నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహించారు. బెంగాల్ విద్యా, వ్యవసాయ శాఖ మంత్రిగా పని చేశారు. 2021లో రాష్ట్ర శాసనసభ డిప్యూటీ స్పీకర్గా విధులు నిర్వర్తించారు. 2026 అసెంబ్లీ ఎన్నికల్లో భాజపా నేత ధ్రువ్ సాహా చేతిలో ఓటమి పాలయ్యారు. ఇదీ చదవండి: కాంగ్రెస్ కార్యాలయంలో పూర్తి వందేమాతరంపై వివాదం గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు