
Prabhas Fauzi:ప్రభాస్ హీరోగా హను రాఘవపూడి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘ఫౌజీ’ సినిమాపై ఆసక్తికర వార్తలు వైరల్ అవుతున్నాయి. పీరియాడిక్ వార్ డ్రామాగా రూపొందుతున్న ఈ సినిమాలో గాంధీజీ, రవీంద్రనాథ్ ఠాగూర్ పాత్రలు కూడా కనిపించనున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఆ రెండు పాత్రల్లో ఎవరు నటించనున్నారనే విషయంపై సినీ వర్గాల్లో ఆసక్తి నెలకొంది. అయితే ఈ పాత్రలకు సంబంధించిన పూర్తి వివరాలపై మేకర్స్ నుంచి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. ఫౌజీపై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి. పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా హను రాఘవపూడి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో ఇమాన్వి హీరోయిన్గా నటిస్తున్నారు. మైత్రి మూవీ మేకర్స్ భారీ బడ్జెట్తో నిర్మిస్తోంది. తాజాగా ఈ సినిమాకు సంబంధించి ఓ ఆసక్తికరమైన ప్రచారం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. సినిమాలో ఇద్దరు ప్రముఖ చారిత్రక వ్యక్తుల పాత్రలు కూడా కనిపించబోతున్నాయని టాక్ వినిపిస్తోంది. తాజా సమాచారం ప్రకారం సీనియర్ బాలీవుడ్ నటుడు అనుపమ్ ఖేర్ ఫౌజీలో మహాత్మా గాంధీ పాత్రలో కనిపించనున్నారని ప్రచారం జరుగుతోంది. ఈ పాత్రకు కథలో కీలకమైన ప్రాధాన్యత ఉంటుందని కూడా వార్తలు వస్తున్నాయి. గతంలో పలు వైవిధ్యమైన, చారిత్రక పాత్రల్లో నటించిన అనుపమ్ ఖేర్ గాంధీజీగా కనిపిస్తే ఆ పాత్రపై మరింత ఆసక్తి పెరిగే అవకాశం ఉంది. అయితే ఈ విషయాన్ని చిత్రబృందం అధికారికంగా ధృవీకరించలేదు. మరోవైపు నటుడు అనిష్ యోహన్ కురువిల్లా రవీంద్రనాథ్ ఠాగూర్ పాత్రలో కనిపించనున్నారనే ప్రచారం కూడా జరుగుతోంది. గాంధీజీతో పాటు ఠాగూర్ పాత్రను కూడా కథలో భాగం చేస్తే ఫౌజీకి మరింత చారిత్రక నేపథ్యం వచ్చే అవకాశం ఉంది. ఈ రెండు పాత్రలను కథలో ఎలా ముడిపెట్టారనేది ఆసక్తికరంగా మారింది. అయితే అనిష్ యోహన్ కురువిల్లా ఠాగూర్ పాత్రలో నటిస్తున్నారనే వార్తకు కూడా ఇప్పటివరకు అధికారిక ధృవీకరణ లేదు. ఇక ఫౌజీ కథ స్వాతంత్య్ర పోరాట కాలం నేపథ్యంలో సాగుతుందనే ప్రచారం ఇప్పటికే