
రాష్ట్ర ఉత్తమ ఉపాధ్యాయ అవార్డులకు తమను కూడా పరిగణనలోకి తీసుకోవాలని, 2026 నుంచి 'ఉత్తమ లైబ్రేరియన్ అవార్డు' పేరుతో ప్రత్యేక కేటగిరీని ఏర్పాటు చేయాలని ఆంధ్రప్రదేశ్లోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలల లైబ్రేరియన్లు ప్రభుత్వాన్ని కోరారు. ఉన్నత విద్యావ్యవస్థలో తమ పాత్ర అత్యంత కీలకమని, తమ సేవలను గుర్తించి ప్రోత్సహించాలని కోరుతూ ప్రభుత్వ డిగ్రీ కళాశాలల లైబ్రేరియన్ల తరఫున డాక్టర్ ఎం. శ్రీనివాస ప్రసాద్ ప్రభుత్వానికి ఒక వినతిపత్రం సమర్పించారు.యూజీసీ నిబంధనల ప్రకారం విద్యార్హతలు, పదోన్నతులు, పరిశోధనల విషయంలో తమకు అధ్యాపకులతో సమానంగా అకడమిక్ హోదా ఉందని లైబ్రేరియన్లు తమ వినతిపత్రంలో పేర్కొన్నారు. మారుతున్న కాలానికి అనుగుణంగా గ్రంథాలయాలు కేవలం పుస్తకాలకే పరిమితం కాకుండా, డిజిటల్ విజ్ఞాన కేంద్రాలుగా రూపాంతరం చెందాయని తెలిపారు. జాతీయ నూతన విద్యా విధానం (NEP 2020) అమలులో, కళాశాలలకు న్యాక్ (NAAC) అక్రిడిటేషన్ కల్పించడంలో లైబ్రేరియన్లు కీలక పాత్ర పోషిస్తున్నారని వారు వివరించారు.పొరుగు రాష్ట్రమైన తెలంగాణలో 2017లోనే 'ఉత్తమ లైబ్రేరియన్ అవార్డు'ను ఏర్పాటు చేశారని, అదే తరహాలో ఆంధ్రప్రదేశ్లో కూడా ఈ అవార్డును ప్రవేశపెట్టడం సాధ్యమేనని వారు గుర్తుచేశారు. లైబ్రేరియన్ల సేవలను గుర్తించేందుకు అవసరమైన మూల్యాంకన పరామితులను రూపొందించాలని కూడా కోరారు. ఇప్పటికే ఈ అంశాన్ని పరిశీలించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఒక కమిటీని నియమించిన విషయాన్ని కూడా వారు ప్రస్తావించారు.లైబ్రేరియన్లకు ప్రత్యేక అవార్డును ఏర్పాటు చేయడం వల్ల వారిలో నూతనోత్సాహం నింపడమే కాకుండా, ఉన్నత విద్యలో నాణ్యతను మరింత పెంచేందుకు దోహదపడుతుందని వారు అభిప్రాయపడ్డారు. అందువల్ల, తమ విజ్ఞప్తిని సానుకూలంగా పరిశీలించి, 2026