ప్రజాస్వామ్య విలువలకు పునరంకితం కావాలి
Actor ProfilePolitician

ప్రజాస్వామ్య విలువలకు పునరంకితం కావాలి

📊 Box Office Collections
Total News1
Movie Updates0
Sources1
ప్రజాస్వామ్య విలువలకు పునరంకితం కావాలి
AP7AM22 Dec 2026
ప్రజాస్వామ్య విలువలకు పునరంకితం కావాలి

వైసీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి దేశ ప్రజలకు 80వ స్వాతంత్య్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. శనివారం ఉదయం సోషల్ మీడియా వేదిక 'ఎక్స్' ద్వారా ఆయన తన సందేశాన్ని పంచుకున్నారు. దేశ నిర్మాణానికి మూలస్తంభాలైన ప్రజాస్వామ్య సూత్రాలకు మనమందరం పునరంకితం కావాలని ఈ సందర్భంగా ఆయన పిలుపునిచ్చారు."ఈ 80వ స్వాతంత్య్ర దినోత్సవం వేళ, మన గొప్ప దేశాన్ని నిర్మిస్తున్న ప్రజాస్వామ్య విలువలకు మనల్ని మనం పునరంకితం చేసుకుందాం. స్వాతంత్య్ర సమరయోధుల పోరాట పటిమను స్ఫూర్తిగా తీసుకుని, ఉజ్వలమైన, సమ్మిళితమైన, సుసంపన్నమైన భారతదేశం కోసం మనమందరం కృషి చేయాలి" అని జగన్ తన పోస్ట్‌లో పేర్కొన్నారు.స్వాతంత్య్ర సమరయోధుల త్యాగాలను స్ఫూర్తిగా తీసుకుని, దేశ భవిష్యత్తు కోసం ప్రతి ఒక్కరూ పాటుపడాలని ఆయన ఆకాంక్షించారు. 'జై హింద్' అంటూ తన సందేశాన్ని ముగించారు

ప రజ స వ మ య వ ల వలక ప నర క త క వ ల Latest News, Movies & Updates | nimisham.in | nimisham.in