
పాన్ మసాలా ప్రకటన విషయంలో షారుఖ్ ఖాన్, అజయ్ దేవగణ్, టైగర్ ష్రాఫ్కు మహారాష్ట్ర ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ షోకాజ్ నోటీసులు జారీ చేసింది. పాన్ మసాలా ప్రచారాన్ని వెంటనే ఆపేయాలని, సోషల్ మీడియా ఖాతాల నుంచి ఆ కంటెంట్ను తొలగించాలని వారిని ఆదేశించింది. వీటికి సంబంధించి జరిగిన ఒప్పందాలు, చెల్లింపుల వ్యవహారాలను తెలియజేయాలని పేర్కొంది. తొలుత షారుఖ్. అజయ్ పాటు అక్షయ్ కూడా ఈ యాడ్కు సైన్ చేశారు. కానీ, పొగాకు ఉత్పత్తిని ప్రోత్సహిస్తున్నటుందనే విమర్శలు రావడంతో అక్షయ్ ఈ యాడ్ నుంచి తప్పుకున్నారు. నా మనస్సాక్షి అంగీకరించదు: సన్నీ డియోల్ పాన్ మసాలా యాడ్స్ తాను నటించనంటూ సన్నీడియోల్ (Sunny Deol) స్పష్టం చేశారు. ఆ ఉత్పత్తులు మంచివని తాను అనుకోవడం లేదని, విశ్వసించని విషయాలను ప్రచారం చేయడానికి తన మనస్సాక్షి అంగీకరించదని అన్నారు. భవిష్యత్తులోనూ వాటికి దూరంగా ఉంటానని పేర్కొన్నారు