
బొంరాస్పేట: వికారాబాద్ జిల్లా బొంరాస్పేట మండలం టేకులగడ్డ తండాకు చెందిన లలితాబాయి(32) పిడుగుపాటుకు గురై మృతిచెందారు. అదే తాండకు చెందిన కిషన్ నాయక్ పొలంలో వరినాటు వేయడానికి వెళ్లిన లలితాబాయి సాయంత్రం ఉరుములు మెరుపులతో వర్షం రావడంతో సమీపంలోని చెట్టు కిందకి వెళ్లారు. ఇంతలో చెట్టుకు సమీపంలో పిడుగు పడింది. విద్యుదాఘతoతో లలితాబాయి అక్కడికక్కడే మృతి చెందారు. కిషన్ నాయక్తోపాటు కూలీకి వచ్చిన ఓ మహిళకు గాయాలు కాగా వారిని కొడంగల్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు