
కిరణ్ కుమార్ శర్మ తంజావూర్ జీ తెలుగు తెలుగు న్యూస్లో ఛీఫ్ సబ్ ఎడిటర్గా పనిచేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి వినోదం, ఆధ్యాత్మికం, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ వ్యవహారాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. సినిమా రివ్యూలు, సినిమాలకు సంబంధించి ప్రత్యేక కథనాలు కూడా రాస్తుంటారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు. ఆయనకు జర్నలిజంలో 18 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. E20 Fuel Vehicles Key Changes: ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా ఎక్కువ దేశాలు పెట్రోల్ దిగుమతిపైనే ఆధారపడ్డాయి. దీనికే ఎక్కువ విదేశీ మారకం ఖర్చు చేయాల్సి వస్తుంది. ఈ నేపథ్యంలో కేంద్రం పెట్రోల్లో 20 శాతం ఇథనాల్ మిశ్రమాన్ని కలుపుతుంది. ఇదే E20 పెట్రోల్గా పిలుస్తున్నారు. ఇప్పటికే అమెరికా, రష్యా, సహా పలు దేశాలు పెట్రోల్లో ఇథనాల్ను కలుపుతున్నాయి. అమెరికాలో అయితే.. ఏకంగా E80 పెట్రోల్ అంటే.. దాదాపు 80 శాతం ఇథనాల్ను కలుపుతున్నట్టు చెబుతున్నారు. పెట్రోల్లో 20 శాతం ఇథనాల్ మిశ్రమం.. మన దేశం ఇపుడిపుడే ఈ దిశగా అడుగులు వేస్తుంది. అందులో భాగంగా ముందుగా 80 శాతం పెట్రోల్కు 20 శాతం ఇథనాల్ మిశ్రమాన్ని కలుపుతున్నాయి. దీన్నే E20 పెట్రోల్గా పిలుస్తున్నారు. ఇథనాల్ హైగ్రోస్కోపిక్ కావడం వల్ల తేమను గ్రహిస్తుంది. అందువల్ల ఇథనాల్ కలిపిన ఇంధనాన్ని వాడితే, ఫ్యూయల్ లైన్ తుప్పు పట్టే ప్రమాదం ఉందని నిపుణులు చెబుతున్న మాట. రబ్బరు సీల్ క్షీణించడం, ఇతర పార్ట్స్ పాడవటం లాంటివి జరగొచ్చు. అందువల్ల ఇథనాల్ కలిపిన ఇంధనాన్ని వాడటానికి వాహనాల్లో కొన్ని మార్పులు చేయాలని చెబుతున్నారు. తుప్పు పట్టకుండా ఏం చేయాలి... తుప్పు పట్టకుండా ఉండేందుకు కొన్ని పూతలు పూయాలి. ఇంజిన్ కంట్రోల్ యూనిట్లను (ECU) కూడా మార్చాలి. అలాగైతేనే, E20 వాడినా వాహనం పాడవకుండా సురక్షితంగా ఉంటుంది. ఈ మార్పులు చేయకుండా E20ని వాడితే వాహనాలు పాడైపోయే ప్రమాదం ఉందని చెబుతున్నారు. కొన్నిసార్లు