
ప్రస్తుతం E25 పెట్రోల్ను ప్రవేశపెట్టే ప్రతిపాదన ఏదీ లేదు పరీక్షలు ఇంకా కొనసాగుతున్నాయి. ఎలాంటి విధాన నిర్ణయం తీసుకోలేదు రెండున్నర సంవత్సరాలుగా వాడుకలో ఇథనాల్ మిశ్రమ ఇంధనం E25 పెట్రోల్ షెడ్యూల్ చేశారన్న వార్తలపై కేంద్ర ప్రభుత్వం ఖండన E20 ethanol Myths : నిజంగా పెట్రోల్లో 20 శాతం ఇథనాల్ కలిపితే దేశానికి ప్రమాదమా? కార్లు, బైకు ఇంజిన్లు వెంటనే పాడవుతాయా? వేల లీటర్ల నీరు వృథా అవుతుందా? నీటి సమస్య ఎదురువుతుందా? ఆహార కొరత ఏర్పడుతుందా? సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న ఈ పుకార్లతో వాహనదారుల్లో తీవ్ర ఆందోళన రేకిత్తిస్తున్నాయి. కానీ, ఈ వాదనలన్నింటికీ కేంద్ర ప్రభుత్వం గట్టిగానే సమాధానం ఇచ్చింది. E20 ఇంధనంపై వైరల్ అవుతున్న అనేక ప్రచారాలకు చెక్ పెట్టింది. E20పై భయం వద్దని సూచిస్తూ శాస్త్రీయ ఆధారాలు, పరిశోధనలు, పరీక్షల వివరాలను బయటపెట్టింది. ఈ క్రమంలోనే పెట్రోల్లో 20 శాతం వరకు ఇథనాల్ను కలిపే E20 ఇంధన మిశ్రమ కార్యక్రమంపై వైరల్ అవుతున్న పుకార్లు, అపోహలను కేంద్ర ప్రభుత్వం ఒక్కొక్కటిగా ఖండించింది. ఇంజిన్ నష్టం నుంచి నీటి వినియోగం వరకు, పర్యావరణ సమస్యల నుంచి ఇంధన భద్రత వరకు వస్తున్న ఆరోపణల్లో ఎలాంటి వాస్తవం లేదని తేల్చి చెప్పింది. E25పై ఇంకా నిర్ణయం తీసుకోలేదు : E25 పెట్రోల్ను విడుదల చేశారనే వార్తలను ప్రభుత్వ వర్గాలు ఖండించాయి. ‘ఇది పూర్తిగా అబద్ధం. పరీక్షలు ఇంకా జరుగుతుండగా E25ను ఎలా షెడ్యూల్ చేయగలరు?’ అని తెలిపాయి. ప్రస్తుతం E25 పెట్రోల్ను ప్రవేశపెట్టే ప్రతిపాదన ఏదీ లేదని స్పష్టం చేసింది. ఇంజిన్లు దెబ్బతింటాయా? : E20 ఇంధనం వాడితే వాహనాల ఇంజిన్లు దెబ్బతింటాయనే ప్రచారాన్ని కూడా కేంద్ర ప్రభుత్వం తోసిపుచ్చింది. ఆటోమోటివ్ రీసెర్చ్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా (ARAI) నిర్వహించిన పరీక్షలను ప్రస్తావించింది. ప్యాసింజర్ వాహనాల్లో సుమారు 40 వేల కిలోమీటర్లు, టూవీలర్ వాహనాల్లో 20 వేల కిలోమీటర్లకు పైగా
