
నూతన పెట్టుబడులను ఆకర్షించడంలో ఆంధ్రప్రదేశ్ దేశంలోనే రెండో స్థానానికి చేరుకుందని రాష్ట్ర విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేశ్ తెలిపారు. కేవలం 24 నెలల వ్యవధిలోనే రాష్ట్రం 9వ స్థానం నుంచి 2వ స్థానానికి ఎగబాకిందని ఆయన వెల్లడించారు. ఈ ఘనత ముఖ్యమంత్రి చంద్రబాబు దార్శనిక నాయకత్వం వల్లే సాధ్యమైందని లోకేశ్ పేర్కొన్నారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. "ముఖ్యమంత్రి చంద్రబాబు విజన్, పారదర్శక పాలన, వ్యాపార నిర్వహణలో వేగం (స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్) వంటి అంశాలే ఆంధ్రప్రదేశ్ పారిశ్రామిక ప్రగతికి మూలస్తంభాలుగా నిలుస్తున్నాయి" అని వివరించారు. రాష్ట్రం వేగంగా పారిశ్రామిక శక్తిగా ఎదుగుతుండటం గర్వకారణమని అన్నారు.ప్రభుత్వం కల్పిస్తున్న సానుకూల వాతావరణంతో ప్రపంచవ్యాప్తంగా పెట్టుబడిదారులు ఆంధ్రప్రదేశ్ వైపు చూస్తున్నారని లోకేశ్ తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం ఫలితాలను అందిస్తుండటంతో, ఇప్పుడు ప్రపంచం చూపు ఏపీ వైపు ఉందని ఆయన వ్యాఖ్యానించారు