Jangaon Retired Teacher Suicide : జనగామ జిల్లా కేంద్రంలో ఓ రిటైర్డ్ ఉపాధ్యాయుడు ఆత్మహత్య చేసుకున్నాడు. ముఖ్యంగా "నా మరణానికి తెలంగాణ ప్రభుత్వం, నా బావమరిదే కారణం" అని పేర్కొంటూ ఏకంగా 20 పేజీల సుదీర్ఘమైన సూసైడ్ నోట్ రాసి బలవన్మరణానికి పాల్పడ్డాడు. తనకు రావాల్సిన పదవీ విరమణ ఆర్థిక ప్రయోజనాలను అందించకుండా ప్రభుత్వం జాప్యం చేయడం, అదే సమయంలో నమ్మిన బంధువులే డబ్బులు ఎగ్గొట్టడంతో తీవ్ర మనస్తాపానికి గురై ఆయన ఈ ఘాతుకానికి ఒడిగట్టారు. ఈ ఘటనతో జిల్లావ్యాప్తంగా సంచలనం రేగుతోంది. ఆర్థిక ఇబ్బందులు.. బంధువుల మోసం..పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. జనగామ జిల్లా కేంద్రంలోని ఇండస్ట్రియల్ ఏరియాలో పగిడిపల్లి మల్లయ్య అనే విశ్రాంత ఉపాధ్యాయుడు నివసిస్తున్నారు. సుదీర్ఘ కాలం ఉపాధ్యాయుడిగా సేవలు అందించి రిటైర్ అయిన మల్లయ్యకు.. తన సొంత బావమరిది, అలాగే ఇతర బంధువులు పెద్ద మొత్తంలో డబ్బులు బాకీ ఉన్నారు. ఆ డబ్బులను తిరిగి ఇవ్వాలని ఆయన ఎంత బతిమిలాడినా, ఎన్ని సార్లు వారి ఇంటి చుట్టూ తిరిగినా వాళ్లు ఆ డబ్బులు ఇవ్వకుండా కాలయాపన చేస్తూ వేధించసాగారు.జీపీఎఫ్ ఇవ్వని ప్రభుత్వం.. లేఖలో హైకోర్టు జడ్జి ప్రస్తావన!ఒకవైపు నమ్మిన బంధువులు మోసం చేయగా.. మరోవైపు జీవితాంతం కష్టపడితే రావాల్సిన రిటైర్మెంట్ బెనిఫిట్స్ ముఖ్యంగా జీపీఎఫ్ (జనరల్ ప్రావిడెంట్ ఫండ్)ను సకాలంలో విడుదల చేయకుండా తెలంగాణ ప్రభుత్వం విపరీతమైన జాప్యం చేసింది. దీంతో తీవ్రమైన ఆర్థిక సంక్షోభంలో మునిగిపోయిన మల్లయ్య.. న్యాయం కోసం కోర్టును ఆశ్రయించినట్లు తెలుస్తోంది. అయినప్పటికీ అక్కడ కూడా తనకు ఆశాజనకమైన ఫలితం దక్కకపోవడంతో.. తన ఆత్మహత్య లేఖలో ఒక హైకోర్టు జడ్జి పేరును కూడా ప్రస్తావిస్తూ.. తన చావుకు వారు కూడా ఒక కారణమంటూ 20 పేజీల లేఖలో సంచలన విషయాలను వెల్లడించారు. ఈ దారుణ పరిస్థితుల నడుమ మనోవేదన భరించలేక మల్లయ్య తన నివాసంలోనే ఆత్మహత్య చేసుకున్నారు.కేసు నమోదు చేసిన పోలీసులు..ఘటనపై
Actor ProfilePolitician
పేజీల డెత్ నోట్ రాసి విశ్రాంత ఉపాధ్యాయుడు ఆత్మహత్య
📊 Box Office Collections
Total News1
Movie Updates0
Sources1
Samayam Telugu•3 Oct 2026
పేజీల డెత్ నోట్ రాసి విశ్రాంత ఉపాధ్యాయుడు ఆత్మహత్య