
2027 అసెంబ్లీ ఎన్నికలే లక్ష్యంగా సిద్ధమవుతున్న పంజాబ్ కాంగ్రెస్లో అంతర్గత కుమ్ములాటలు తారస్థాయికి చేరాయి. పీసీసీ అధ్యక్షుడు అమ్రీందర్ సింగ్ రాజా వారింగ్ను పదవి నుంచి తొలగించాలంటూ మాజీ ముఖ్యమంత్రి చరణ్జీత్ సింగ్ చన్నీ వర్గం పట్టుబట్టడంతో పార్టీలో సంక్షోభం ముదిరింది. ఈ విషయంపై చర్చించేందుకు శనివారం ఏఐసీసీ పంజాబ్ ఇన్ఛార్జ్ భూపేష్ బఘేల్తో చన్నీ వర్గం నేతలు రహస్యంగా భేటీ అయ్యారు. అయితే, పీసీసీ చీఫ్ మార్పు విషయంలో ఎలాంటి హామీ లభించకపోవడంతో ఈ సమావేశం అసంపూర్తిగా ముగిసింది.చండీగఢ్లో సీనియర్ ఎమ్మెల్యే రాణా గుర్జీత్ సింగ్ నివాసంలో ఈ కీలక సమావేశం జరిగింది. దాదాపు రెండు గంటల పాటు సాగిన ఈ భేటీలో చన్నీతో పాటు ప్రతిపక్ష నేత ప్రతాప్ సింగ్ బాజ్వా, మాజీ ఉప ముఖ్యమంత్రి సుఖ్జీందర్ సింగ్ రంధావా సహా పలువురు మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలు పాల్గొన్నారు. జులై 1న కాంగ్రెస్ అధిష్ఠానం రాజా వారింగ్ను పీసీసీ అధ్యక్షుడిగా కొనసాగిస్తూ, చన్నీని ప్రచార కమిటీ ఛైర్మన్గా నియమించింది. ఈ నిర్ణయంపై తీవ్ర అసంతృప్తితో ఉన్న చన్నీ వర్గం, వారింగ్ను తొలగించాల్సిందేనని బఘేల్ ముందు గట్టిగా డిమాండ్ చేసింది.సమావేశం అనంతరం భూపేష్ బఘేల్ మీడియాతో మాట్లాడుతూ.. పార్టీలో ఎలాంటి విభేదాలు లేవని, నేతలు తమ అభిప్రాయాలను తెలిపారని, వాటిని అధిష్ఠానం దృష్టికి తీసుకెళ్తానని చెప్పారు. అయితే, భేటీ నుంచి బయటకు వచ్చిన నేతలు మాత్రం తమ డిమాండ్పై స్పష్టంగా ఉన్నామని తేల్చిచెప్పారు. ముఖ్యంగా, మాజీ డిప్యూటీ సీఎం రంధావా మాట్లాడుతూ.. సీఎం భగవంత్ మాన్ను