
మనిషి కనుగొన్న తొలినాటి క్రీడలలో జూదం అతి పురాతనమైనది. దాదాపు అన్ని నాగరికతల శిథిలాల్లోనూ జూదక్రీడకు సంబంధించిన అవశేషాలు దొరికిన దాఖలాలు ఉన్నాయి. ఇటీవల అమెరికన్ శాస్త్రవేత్తలు ఇరాక్లో జరిపిన తవ్వకాల్లో మెసపటేమియా నాగరికత నాటి పురాతనమైన పాచికలు దొరికాయి. ఇవి కనీసం పన్నెండేళ్ల కిందటివని శాస్త్రవేత్తలు నిర్ధారించారు. ఇప్పటి వరకు వేర్వేరు ప్రదేశాల్లో దొరికిన పాచికలన్నింటికంటే ఇవే అత్యంత పురాతనమైనవి. నాగిరకతల ప్రాదుర్భావంలో జూదం వంటి క్రీడలే మనుషుల మధ్య సామాజిక సంబంధాలకు ఆలంబనగా ఉండేవని వీటిని కనుగొన్న డార్ట్మౌత్ కాలేజీకి చెందిన పురాతత్త్వ శాస్త్రవేత్త రాబర్ట్ వీనర్ తెలిపారు. ఈ పాచికలను ‘అమెరికన్ యాంటిక్విటీ’ మ్యూజియంలో భద్రపరచారు. శాస్త్రవేత్తలు జరిపిన తవ్వకాల్లో ఈ పాచికలతో పాటు అదే కాలానికి చెందిన మరో 94 పురాతన వస్తువులు కూడా దొరికాయి. (చదవండి: సలాం సాబ్'.. 80 ఏళ్ల వ్యక్తిపై ఆనంద్ మహీంద్రా ప్రశంసల జల్లు!) 'సావిత్రి క్లాసిక్స్' బుక్ లాంచ్ (ఫొటోలు) ఆదియోగి విగ్రహాం ముందు సీరియల్ నటి పెళ్లి (ఫొటోలు) రామ్గోపాల్ వర్మ ‘రక్త చరిత్ర’ రీ రిలీజ్ ప్రెస్మీట్ (ఫొటోలు) మీ పేరు శాశ్వతం.. మాట లేకపోయినా పాట ఉంటుంది.. జానకమ్మకు అశ్రు నివాళులు సాగు చేసుకునే భూమిని.. వాళ్ళు ఎలా లాక్కుంటారు?