
హైదరాబాద్ నుంచి ఆంధ్రప్రదేశ్లోని అమరావతి, బందరు పోర్టులను అనుసంధానించేలా రెండు భారీ మౌలిక సదుపాయాల ప్రాజెక్టులు సమాంతరంగా పరుగులు పెట్టనున్నాయి. హైదరాబాద్-చెన్నై హైస్పీడ్ రైల్వే లైన్, ఫ్యూచర్ సిటీ-బందరు పోర్టు 12 వరుసల గ్రీన్ఫీల్డ్ ఎక్స్ప్రెస్వేలను పక్కపక్కనే నిర్మించేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రాథమికంగా అంగీకరించాయి. విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం, హైదరాబాద్-విజయవాడ ప్రస్తుత జాతీయ రహదారికి ఎడమవైపు ఎక్స్ప్రెస్వే, కుడివైపు హైస్పీడ్ రైలు మార్గం ఉండేలా అలైన్మెంట్ ఖరారు చేశారు.760 కిలోమీటర్ల హైస్పీడ్ రైలు మార్గంహైదరాబాద్-అమరావతి-చెన్నై మధ్య ప్రతిపాదించిన ఈ హైస్పీడ్ రైల్వే కారిడార్ మొత్తం పొడవు 760 కిలోమీటర్లు. ఇందులో తెలంగాణ పరిధిలో 180 కిలోమీటర్ల మేర నిర్మాణం జరగనుంది. ఈ మార్గంలో శంషాబాద్, భారత్ ఫ్యూచర్ సిటీ, డ్రై పోర్టు, నాగార్జునసాగర్ (హాలియా), వాడపల్లి వద్ద స్టేషన్లు ఏర్పాటు చేయనున్నారు. ఈ ప్రాజెక్టు అంచనా వ్యయం రూ. 2.24 లక్షల కోట్లు కాగా, దాదాపు 790 హెక్టార్ల భూమి అవసరమని ప్రాథమికంగా నిర్ధారించారు. ఇప్పటికే ఈ మార్గంలో మార్కింగ్ పనులు పూర్తయ్యాయి.298 కిలోమీటర్ల గ్రీన్ఫీల్డ్ ఎక్స్ప్రెస్వేహైదరాబాద్ ఔటర్ రింగు రోడ్డు (ఓఆర్ఆర్), రీజినల్ రింగు రోడ్డు (ట్రిపుల్ ఆర్) మధ్యలో ఉన్న ముచ్చర్ల ఫ్యూచర్ సిటీ సమీపంలోని తిప్పారెడ్డిపల్లి వద్ద ఈ 12 వరుసల గ్రీన్ఫీల్డ్ ఎక్స్ప్రెస్వే ప్రారంభం కానుంది. ఇది అమరావతి మీదుగా మచిలీపట్నం-బందరు పోర్టుకు అనుసంధానమవుతుంది. మొత్తం 297.82 కిలోమీటర్ల పొడవున్న ఈ మార్గంలో తెలంగాణ పరిధిలో 118 కిలోమీటర్లు (40 గ్రామాల మీదుగా), ఏపీలో మిగిలిన భాగం (60