నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. వరుస ఉద్యోగ నోటిఫికేషన్ల
Actor ProfilePolitician

నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. వరుస ఉద్యోగ నోటిఫికేషన్ల

📊 Box Office Collections
Total News1
Movie Updates0
Sources1
నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. వరుస ఉద్యోగ నోటిఫికేషన్లపై కీలక ప్రకటన
Samayam Telugu27 Dec 2026
నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. వరుస ఉద్యోగ నోటిఫికేషన్లపై కీలక ప్రకటన

తెలంగాణలో ప్రభుత్వ ఉద్యోగాల భర్తీ ప్రక్రియను వేగవంతం చేసేందుకు తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (TGPSC) కీలక నిర్ణయాలు తీసుకుంటోంది. వచ్చే వారం నుంచి వివిధ శాఖల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి వరుసగా నోటిఫికేషన్లు జారీ చేయనున్నట్లు టీజీపీఎస్సీ ఛైర్మన్‌ బుర్రా వెంకటేశం వెల్లడించారు. అభ్యర్థుల్లో నమ్మకాన్ని పెంపొందించేలా పరీక్షల నిర్వహణ, మూల్యాంకనం, ఫలితాల వెల్లడిలో పారదర్శకత, కచ్చితత్వం, జవాబుదారీతనానికి అత్యధిక ప్రాధాన్యం ఇస్తామని తెలిపారు.శనివారం టీజీపీఎస్సీ కార్యాలయంలో స్వాతంత్య్ర దినోత్సవాన్ని పురస్కరించుకునిబుర్రా వెంకటేశం జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. అనంతరం ఉద్యోగులతో మాట్లాడిన ఆయన.. టీజీపీఎస్సీ రాజ్యాంగబద్ధమైన సంస్థ కావడంతో ప్రతి నిర్ణయాన్ని అత్యంత జాగ్రత్తగా తీసుకోవాల్సిన అవసరం ఉందన్నారు. నియామక ప్రక్రియలో చిన్నపాటి పొరపాటు జరిగినా దాని ప్రభావం వేలాది మంది అభ్యర్థుల భవిష్యత్తుపై పడే అవకాశం ఉందని పేర్కొన్నారు.పరీక్షల నిర్వహణలో ఉద్యోగులందరూ ప్రతి దశలో అప్రమత్తంగా వ్యవహరించాలని ఛైర్మన్‌ సూచించారు. ప్రశ్నపత్రాల రూపకల్పన నుంచి పరీక్ష నిర్వహణ, మూల్యాంకనం, ఫలితాల ప్రకటన వరకు అన్ని దశల్లో ప్రమాణాలను మరింత మెరుగుపరచాలని అన్నారు. ముఖ్యంగా నియామక ప్రక్రియలో సాంకేతికత వినియోగాన్ని పెంచాల్సిన అవసరం ఉందని చెప్పారు. డిజిటల్‌ విధానాలు, డేటా ఆధారిత పర్యవేక్షణ, పరీక్షల నిర్వహణలో ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం వినియోగం ద్వారా పొరపాట్లకు తావులేని వ్యవస్థను రూపొందించేందుకు చర్యలు తీసుకుంటామని తెలిపారు.ఇదే సమయంలో ప్రభుత్వ ఉద్యోగాల భర్తీపై ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి కూడా కీలక ప్రకటన చేశారు. ప్రభుత్వ శాఖల్లో ఏర్పడే ఉద్యోగ ఖాళీలను గుర్తించి ఆరు నెలలకు ఒకసారి పోటీ పరీక్షలు నిర్వహించేలా చర్యలు తీసుకుంటామని ఆయన వెల్లడించారు. స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా సంగారెడ్డి పట్టణంలోని డాక్టర్‌ బీఆర్‌ అంబేద్కర్‌ స్టేడియంలో నిర్వహించిన కార్యక్రమంలో స్మార్ట్‌ రేషన్‌ కార్డుల పంపిణీని లాంఛనంగా ప్రారంభించిన అనంతరం సీఎం మాట్లాడారు. అధికారంలోకి వచ్చిన ఏడాది కాలంలోనే సుమారు 70 వేల ప్రభుత్వ ఉద్యోగాలను భర్తీ చేశామని రేవంత్‌రెడ్డి తెలిపారు.ఇటీవల మరో 10 వేల