
విజయనగరం: నేరాలు చేసేవారిని పరామర్శించేందుకే జగన్ యాత్రలు చేస్తున్నారని మంత్రి సత్యకుమార్ యాదవ్ విమర్శించారు. విజయనగరం జిల్లా బొబ్బిలిలో పర్యటించిన ఆయన మీడియాతో మాట్లాడారు. ప్రజా సమస్యలపై చిత్తశుద్ధి ఉంటే అసెంబ్లీకి రావాలని సవాల్ విసిరారు. జగన్ అసెంబ్లీకి రారు.. వాళ్ల ఎమ్మెల్యేలను కూడా పంపట్లేదని విమర్శించారు. రాష్ట్రవ్యాప్తంగా పీపీపీ విధానంలో మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రుల నిర్మాణానికి ఆలోచన చేస్తున్నట్టు మంత్రి చెప్పారు. గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు