
తెలుగు సినీ పరిశ్రమలో తనదైన ముద్ర వేసిన సింగర్ హేమచంద్ర. గాయకుడిగా, సంగీత దర్శకుడిగా, డబ్బింగ్ ఆర్టిస్ట్గా, స్వతంత్ర సంగీత కళాకారుడిగా పలు విభాగాల్లో రాణించారు. ఇటీవల ఒక ఇంటర్వ్యూలో హేమచంద్ర మాట్లాడుతూ తన కెరీర్ ప్రస్థానం, స్వతంత్ర సంగీతం పట్ల తన అభిరుచి, ఈ ప్రయాణంలో ఎదురైన కీలక అనుభవాలను పంచుకున్నారు. హేమచంద్ర తన కెరీర్ ఆరంభాన్ని గుర్తుచేసుకుంటూ, రియాలిటీ టెలివిజన్ నుండి ప్లేబ్యాక్ సింగింగ్కు మారిన విధానం, “ఫిదా”, “RRR”, “మహర్షి”, “జై లవకుశ” వంటి అనేక విజయవంతమైన చిత్రాలకు తన గాత్రాన్ని అందించిన తీరును వివరించారు. సంగీత దర్శకుడిగా, “ధృవ”, “ఊపిరి”, “భారత్ అనే నేను” వంటి చిత్రాలకు ప్రముఖ నటులకు డబ్బింగ్ ఆర్టిస్ట్గా తన బహుముఖ ప్రజ్ఞను ప్రదర్శించారు. అయితే, ఆయన హృదయం ఎప్పుడూ స్వతంత్ర సంగీతం పట్లనే ఉందని, తెలుగు ఇండి సంగీత రంగాన్ని కొత్త శిఖరాలకు చేర్చాలనేదే తన లక్ష్యమని స్పష్టం చేశారు. ఎక్కువ మంది చదివినవి : Jason Sanjay: ఇద్దరి మధ్య ఎప్పుడూ గొడవలే.. దూరమయ్యాకే విలువ తెలిసింది.. విజయ్ దళపతి కొడుకు జాసన్ సంజయ్.. స్వతంత్ర సంగీతంలో సహకారం, కలిసికట్టుగా కృషి చేయడం ప్రాముఖ్యతను హేమచంద్ర చెప్పారు. అలాగే పలు పెద్ద లేబుల్స్ స్వతంత్ర పాటలను ప్రోత్సహిస్తున్నప్పటికీ, వ్యక్తిగత ఎదుగుదల కంటే మొత్తం ఇండి సీన్ అభివృద్ధి చెందాలనే తన ఆలోచనను వెల్లడించారు. “ఒక్క ఆర్టిస్ట్ గురించి కాదు. నా లక్ష్యం నేను ఒక్కడినే పాటలు పడి ఎదగడం కాదు. తెలుగు ఇండి సీన్ను ఎక్కడో ఒకచోట పెరగాలని నేను కోరుకుంటున్నాను. అంతర్జాతీయంగా వెళ్ళాలని నేను కోరుకుంటున్నాను,” అని చెప్పుకొచ్చారు. ఇది కేవలం తన గురించిన ప్రయాణం కాదని, తెలుగు సంగీత రంగంలో మార్పు తీసుకురావాలనే ఆకాంక్ష అని ఆయన మాటల్లో స్పష్టమైంది. తన తండ్రి ఇచ్చిన ఒక అద్భుతమైన సలహాను హేమచంద్ర ఈ సందర్భంగా గుర్తు చేసుకున్నారు. “నీకు మైండ్కి