
Telugu Times•23 Nov 2026
నేడు నాగార్జునసాగర్ లో వరుణయాగం.. పూర్ణాహుతిలో పాల్గొననున్న సీఎం రేవంత్ రెడ్డినాగార్జునసాగర్లో వరుణ యాగం.. సాగర్ విజయ్ విహార్ టూరిజం గెస్ట్హౌస్ ప్రాంగణంలో యాగం.. మధ్యాహ్నం 3 గంటలకు పూర్ణాహుతి కార్యక్రమంలో పాల్గొననున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. మధ్యాహ్నం 2 గంటలకు హైదరాబాద్ నుంచి హెలికాప్టర్లో బయలుదేరనున్న సీఎం. 2.45 గంటలకు నాగార్జునసాగర్ హిల్ కాలనీలోని బీసీ రెసిడెన్షియల్ స్కూల్కు చేరుకోనున్న ముఖ్యమంత్రి. అక్కడి నుంచి విజయ్ విహార్ టూరిజం గెస్ట్హౌస్ ప్రాంగణంలో జరిగే యాగం వద్దకు చేరుకోనున్న సీఎం. యాగం ముగిసిన అనంతరం 4 గంటలకు హైదరాబాద్కు బయలుదేరనున్న ముఖ్యమంత్రి. 108 మంది రుత్వికులతో, 11 హోమగుండాలతో విజయ్ విహార్లో వరుణ యాగం. యాదగిరిగుట్ట శ్రీలక్ష్మీనరసింహస్వామి ఆలయానికి చెందిన అర్చకులు, వేదపండితుల ఆధ్వర్యంలో వరుణయాగం. కృష్ణా, గోదావరి పరీవాహక ప్రాంతాల్లో సమృద్ధిగా వర్షాలు కురవాలని సంకల్పం