
కాళేశ్వరం విషయంలో డ్రామాలు ఆడుతున్నారని కాంగ్రెస్ ప్రభుత్వంపై బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. కాళేశ్వరం ప్రాజెక్ట్ రిపేర్ చేయకుండా ఎందుకు జాప్యం చేస్తున్నారని ప్రశ్నించారు. హైదరాబాద్, జులై 10: కాళేశ్వరం విషయంలో డ్రామాలు ఆడుతున్నారని రాష్ట్ర ప్రభుత్వంపై బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈరోజు(శుక్రవారం) మీడియాతో మాట్లాడుతూ.. ‘నేడు ఒకరు ఆడించినట్టు ఆడే వ్యక్తిని కాదు. నాకు తెలంగాణ ఫస్ట్.. తర్వాతే పార్టీ.. ఆ తర్వాతే వ్యక్తిగతం’ అని స్పష్టం చేశారు. రాజకీయాల ముసుగులో ప్రజల జీవితాలతో ఆడుకోవద్దని హెచ్చరించారు. ఉత్తర తెలంగాణకు నీళ్ల జంక్షన్ మిడ్ మానేరు అని తెలిపారు. కాళేశ్వరం ప్రాజెక్ట్ రిపేర్ చేయకుండా ఎందుకు జాప్యం చేస్తున్నారని ప్రశ్నించారు. కరవు వస్తుందని తెలిసీ ఎందుకు ఇలా వ్యవహరిస్తున్నారని ఎంపీ మండిపడ్డారు. లోలెవల్ పాయింట్కు వచ్చే నీటిని ఎందుకు ఎత్తిపోయడం లేదని ప్రభుత్వంపై ఎంపీ ఈటల రాజేందర్ ప్రశ్నల వర్షం కురిపించారు. ఈనెల 20లోపు సింగరేణిలో డిపెండెంట్ ఉద్యోగాలపై స్పష్టత ఇవ్వాల్సిందే: కవిత