నేడు అయోధ్య రామాలయ ట్రస్ట్ భేటీ.. చంపత్ రాయ్ రాజీనామా
Actor ProfilePolitician

నేడు అయోధ్య రామాలయ ట్రస్ట్ భేటీ.. చంపత్ రాయ్ రాజీనామా

📊 Box Office Collections
Total News1
Movie Updates0
Sources1
నేడు అయోధ్య రామాలయ ట్రస్ట్ భేటీ.. చంపత్ రాయ్ రాజీనామాపై తుది నిర్ణయం
Zee Telugu26 Sept 2026
నేడు అయోధ్య రామాలయ ట్రస్ట్ భేటీ.. చంపత్ రాయ్ రాజీనామాపై తుది నిర్ణయం

కిరణ్ కుమార్ శర్మ తంజావూర్ జీ తెలుగు తెలుగు న్యూస్‌లో ఛీఫ్ సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి వినోదం, ఆధ్యాత్మికం, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ వ్యవహారాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. సినిమా రివ్యూలు, సినిమాలకు సంబంధించి ప్రత్యేక కథనాలు కూడా రాస్తుంటారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు. ఆయనకు జర్నలిజంలో 18 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. Champat rais Resignation: అయోధ్య రామ మందిరం చోరీ కేసు కోట్లాది హిందువుల మనోభావాలను గాయపరించింది. ఈ నేపథ్యంలో అయోధ్య రామ మందిరం విరాళాల ఇష్యూను హిందూ సమాజాన్ని కించ పరిస్తే సహించేది లేదన్నారు ఆర్ఎస్ఎస్ అధికార ప్రతినిధి దత్తాత్రేయ హోస్‌బోలే. మరోవైపు ఈ చోరీ అంశం దేశ వ్యాప్తంగా ప్రతిపక్షాలకు ఓ ఆయుధం దొరికినట్టైయింది. అయోధ్య విరాళాల చోరీ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న ట్రస్ట్‌ ప్రధాన కార్యదర్శి చంపత్‌ రాయ్, ట్రస్టీ అనిల్‌ మిశ్రా సమర్పించిన రాజీనామాలపై ప్రధానంగా చర్చ జరిగే అవకాశముంది. ఆలయ ట్రస్ట్‌ అధ్యక్షుడి ఆశ్రమంలో జరిగే ఈ భేటీకి ట్రస్ట్‌ సభ్యులు, ఎక్స్‌ అఫీషియో సభ్యులంతా హాజరు కావాలని ట్రస్ట్‌ ట్రెజరర్‌ గోవింద్‌ కోరారు. వయో సంబంధ సమస్యలతో చికిత్స పొందుతూ శుక్రవారం ఆస్పత్రి నుంచి డిశ్చార్జి అయిన 89 ఏళ్ల ట్రస్ట్‌ అధ్యక్షుడు నృత్య గోపాల్‌ దాస్‌ సమావేశానికి వస్తారని తెలుస్తోంది. ఆలయ నిర్వహణ బాధ్యతలు చూసుకునేందుకు చీఫ్‌ ఎగ్జిక్యూటివ్‌ అధికారి(సీఈవో)ని నియమించే విషయం చర్చకు రానుంది. ప్రత్యేక ఆహ్వానితుడిగా ఉన్న గోపాల్‌ రావు పాత్రపైనా చర్చ జరిగే అవకాశముందంటున్నారు. ఆలయంలో విరాళాల మాయంపై రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన సిట్‌ అందజేసిన మధ్యంతర నివేదికలోని అంశాలు ప్రస్తావనకు రానున్నాయి. ఈ భేటీలో 2025–26 ఆర్థిక సంవత్సరంలో ఆలయ ఆదాయ వ్యయాల నివేదికను ఆమోదించనున్నారు. ప్రస్తుతం ట్రస్ట్‌ అధ్యక్షుడు నృత్యగోపాల్‌ దాస్‌తోపాటు 11 మంది రెగ్యులర్‌ సభ్యులున్నారు. ఆలయ విరాళాల