
పరేష్ జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్గా పనిచేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి నేషనల్, సోషల్ మీడియా వైరల్ న్యూస్, క్రైమ్, తెలంగాణ, ఏపీ రాజకీయాలు, ఆస్ట్రాలజీ, లైఫ్ స్టైల్ వ్యవహరాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు. konda sushmita fires on cm revanth reddy: తెలంగాణ రాజకీయాల్లో ప్రస్తుతం కొండా సుష్మిత వర్సెస్ సీఎం రేవంత్ రెడ్డి మధ్య వివాదం పీక్స్ కు చేరింది. ఇటీవల సీఎం రేవంత్ రెడ్డి పరకాల సభకు వచ్చినప్పుడు వచ్చే ఎన్నికల్లో పరకాల నుంచి రేవూరీ ప్రకాశ్ రెడ్డి బరిలో ఉంటారని చెప్పారు. ఈ వ్యాఖ్యలపై కొండా సుష్మిత రేవంత్ రెడ్డిపై ఘాటు వ్యాఖ్యలు చేశారు. అసలు వచ్చే రెండెళ్లు కాదు.. ఇప్పుడు రాజీనామా చేసి ఎన్నికలకు వెళ్లాలని సవాల్ విసిరారు. పరకాల గడ్డ కొండా సుష్మిత అడ్డా అంటూ ఫైర్ అయ్యారు. సీఎం రేవంత్ బాగోతాలు, ఆయన సోదరుల బాగోతాలు బైటపెడ్తామన్నారు. ఈ వ్యాఖ్యలపై తెలంగాణ కాంగ్రెస్ సీరియస్ అయ్యింది. మంత్రి కొండా సురేఖకు తెలంగాణ కాంగ్రెస్ క్రమశిక్షణ కమిటీ నోటీసులు జారీ చేసింది. దీనికి కొండా సురేఖ తన కూతురు వ్యాఖ్యలు ఆమె వ్యక్తిగతమన్నారు. ఈ నేపథ్యంలో దీనిపై కాంగ్రెస్ పార్టీకి చెందిన మహిళ నేతలు.. కొండా సుష్మిత వ్యాఖ్యలపై కౌంటర్ లు ఇచ్చారు. ఈ వివాదం నడుస్తున్న వేళ.. మరోసారి కొండా సుష్మిత పటేల్ సీఎం రేవంత్ రెడ్డిపై, కాంగ్రెస్ అధిష్టానంపై కీలక వ్యాఖ్యలు చేశారు. కొండా సుష్మిత పటేల్ మాట్లాడుతూ.. అసలు రేవంత్ ఎవడు?.. అధిష్టానం మాటే ఫైనల్ అని మాట్లాడారు. ఇలాగే చేస్తే రేపు సీల్డ్ కవర్లో ఇంకో సీఎం పేరు వస్తుందని ఏకీపారేశారు. అసలు నా టార్గెట్ రేవంత్ రెడ్డి.. కాంగ్రెస్ కాదని స్పష్టం చేశారు. రాహుల్, సోనియా గాంధీలపై గౌరవం ఉందన్నారు. రేవంత్