
మార్కెట్లో నోకియా కీప్యాడ్ ఫోన్లకు మంచి డిమాండ్ ఉండేది. కాలక్రమంలో స్మార్ట్ఫోన్లకు ఆదరణ పెరగడంతో కంపెనీ కొత్త కీప్యాడ్ మొబైల్స్ లాంచ్ చేయడం మానేసింది. అయితే ఇప్పుడు హెచ్ఎమ్డీ గ్లోబల్ తాజాగా నాలుగు కొత్త ఫీచర్ ఫోన్లను విడుదల చేసింది. హెచ్ఎమ్డీ లాంచ్ చేసిన నాలుగు ఫోన్లు 'నోకియా 200 4జీ, నోకియా 210 4జీ, నోకియా 215 4జీ సెకండ్ ఎడిషన్, నోకియా 235 4జీ సెకండ్ ఎడిషన్'. వీటి ప్రత్యేకత ఏమిటంటే, మొదటిసారిగా ఫీచర్ ఫోన్లలో కూడా AI అసిస్టెంట్ బటన్ ప్రవేశపెట్టడం. ఈ ఫోన్లలో డీ-ప్యాడ్ మీద ఒక ప్రత్యేక బటన్ ఉంటుంది. దాని ద్వారా Sikey AI అనే అసిస్టెంట్ పనిచేస్తుంది. ఇది వినియోగదారుల వాయిస్ కమాండ్లకు స్పందించి ఫ్లాష్లైట్ ఆన్ చేయడం, కెమెరా ఓపెన్ చేయడం, రిమైండర్లు సెట్ చేయడం, అలాగే సాధారణ ప్రశ్నలకు సమాధానాలు ఇవ్వడం వంటి పనులు చేస్తుంది. వీటిలో 1450mAh బ్యాటరీ, 4G సపోర్ట్, బ్లూటూత్ 5.0, ఎఫ్ఎమ్ రేడియో, USB-C ఛార్జింగ్ వంటి సదుపాయాలు ఉన్నాయి. మోడల్ను బట్టి 2.4 అంగుళాలు లేదా 2.8 అంగుళాల డిస్ప్లేలు అందుబాటులో ఉంటాయి. అయితే కంపెనీ ఈ ఫోన్ ధరలను అధికారికంగా వెల్లడించలేదు. తిరుపతిలో ఘనంగా 'లెనిన్' ప్రీ రిలీజ్ ఈవెంట్ (ఫొటోలు) తిరుమల శ్రీవారి సేవలో నాగార్జున కుటుంబం (ఫొటోలు) మాల్దీవులు ట్రిప్ వేసిన హీరోహీరోయిన్ జంట (ఫొటోలు) ఎన్టీఆర్ బావమరిది కొత్త సినిమా గ్రాండ్ లాంచ్ (ఫొటోలు) ఒకప్పటి హీరోయిన్ ఇప్పుడు షాకిచ్చేలా.. గుర్తుపట్టారా? (ఫొటోలు) జగన్ అధికారంలోకి వచ్చాక.. వణికిపోతున్న TDP, జనసేన నేతలు సముద్రంలో గల్లంతు.. మావాళ్లను వెతికిపెట్టండి.. దండంపెట్టి వేడుకుంటున్న మత్స్యకారులు పోయేకాలం వస్తే ఇలాంటి కేసులే పెడతారు.. దేశద్రోహం కేసు పెట్టాల్సింది పవన్, బాబు పైనే..? 60ఏళ్ల వయసులో 3వ వివాహం చేసుకున్న అమిర్ ఖాన్ వేదాంతా పవర్ జాక్ పాట్! ఇన్వెస్టర్లకు భారీ లాభాలు!