
ఎప్పటికైనా దక్షిణ భారతానికి చెందిన కుర్రాడినే పెళ్లాడతానని ప్రముఖ సినీనటి నిధి అగర్వాల్ చెప్పారు. ఎప్పటికైనా దక్షిణ భారతానికి చెందిన కుర్రాడినే పెళ్లాడతానని ప్రముఖ సినీనటి నిధి అగర్వాల్ (Nidhhi Agerwal) చెప్పారు. తిరుపతిలో బుధవారం ఆమె హ్యాపీ మొబైల్స్కు సంబంధించిన కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె విలేకరులు అడిగిన ప్రశ్నకు సమాధానంగా ప్రస్తుతానికి పెళ్లి ఆలోచన లేదని చెప్పారు. సౌత్కు చెందిన అబ్బాయినే వివాహం చేసుకుంటానని, వరుడు కుదిరిన వెంటనే తిరుపతిలో పర్యటించి ప్రకటిస్తానన్నారు. ఇంకా నిధి మాట్లాడుతూ.. ప్రస్తుతం నేను రెండు తమిళ చిత్రాల్లో నటిస్తున్నానని, రెండు తెలుగు చిత్రాల్లో నటించడానికి సంతకం చేశానన్నారు. కాగా నిధి అగర్వాల్ తిరుమల శ్రీవారిని ఉదయం వీఐపీ బ్రేక్ సమయంలో దర్శించుకు న్నారు. అనంతరం నిధి అగర్వాల్ ఆలయం ముందు మీడియాతో మాట్లాడుతూ స్వామి దర్శనం చాలా సంతోషాన్ని కలిగించిందన్నారు