
తెలంగాణ కేంద్రంగా బీజేపీ నాయకత్వం ఆలోచన మారుతోంది. కొత్త నిర్ణయాలతో ముందుకు వెళ్తోంది. తాజాగా ప్రకటించిన బీజేపీ జాతీయ కమిటీలో తెలంగాణ నుంచి పార్టీ నేతలకు ఎలాంటి ప్రాతినిధ్యం దక్కలేదు. ఉన్న ఇద్దరు నేతలను తప్పించారు. బీజేపీ హైకమాండ్ పక్కన పెట్టటం వెనుక కారణాల పైన భిన్నాభిప్రాయలు వ్యక్తం అవుతున్నాయి. ఇదే సమయంలో రాజాసింగ్ ఈ పరిణామాల పైన ఆసక్తి కర వ్యాఖ్యలు చేసారు. కీలక అంశాలను ప్రస్తావించారు.బీజేపీ జాతీయ కమిటీని ప్రకటించారు. ఇప్పటి వరకు తెలంగాణ నుంచి జాతీయ పార్టీలో కొనసాగు తున్న వారిని తప్పించారు. అసలు కొత్తగా ఎవరికీ అవకాశం కల్పించ లేదు. దీని వెనుక కొత్త లెక్క లు తెర మీదకు వస్తున్నాయి. దక్షిణాదిలో తెలంగాణ పైన బీజేపీ ఈ సారి ప్రత్యేకంగా ఫోకస్ చేస్తూ కొత్త నిర్ణయాలు తీసుకుంటోంది. ఈ క్రమంలోనే వచ్చే అసెంబ్లీ ఎన్నికలే లక్ష్యంగా రాష్ట్ర పార్టీకి దిశా నిర్దేశం చేస్తోంది. వరుసగా కేంద్ర మంత్రులు రాష్ట్రంలో పర్యటిస్తూ.. పలు వర్గాలతో మమేకం అయ్యే విధంగా కార్యాచరణ అమలు అవుతోంది. ఈ సమయంలోనే జాతీయ కమిటీలో తెలంగాణ కు అవకాశం ఇవ్వకపోటం పైన రాజాసింగ్ కీలక వ్యాఖ్యలు చేసారు. కీలక అంశాలను ప్రస్తావిస్తూ.. పార్టీ నేతలకు సూచనలు చేసారు. అయితే, అసలు బీజేపీ వ్యూహం మరోలా ఉందనే చర్చ పార్టీ నేతల్లో వినిపిస్తోంది. 24-కోచ్ల వందే భారత్ స్లీపర్ రైళ్లు సిద్దం: తెలుగు రాష్ట్రాలకు ఇలా, రూట్.. షెడ్యూల్..!!పార్టీ పరిణామాల పై హైకమాండ్ ఫోకస్తాజా పరిణామాల పైన స్పందించిన రాజా సింగ్.. తెలంగాణ బీజేపీలో ప్రతిసారి గ్రూప్ రాజకీయాలు, ఢిల్లీకి ఫిర్యాదులు చేయడం చేస్తారని చెప్పుకొచ్చారు. అందుకే బీజేపీ జాతీయ కార్యవర్గంలో తెలంగాణ నాయకులకు చోటు దక్కలేదని పేర్కొన్నారు. ఇప్పటికైనా తెలంగాణ బీజేపీ నాయకులు మారాలి అని హితవు పలికారు. కాంగ్రెస్ ప్రభుత్వం పైన దూకుడుగా పోరాటం చేయాల్సిన సమయంలో హైకమాండ్ ఆశించిన విధంగా వ్యవహరించకపోవటం