
కిరణ్ కుమార్ శర్మ తంజావూర్ జీ తెలుగు తెలుగు న్యూస్లో ఛీఫ్ సబ్ ఎడిటర్గా పనిచేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి వినోదం, ఆధ్యాత్మికం, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ వ్యవహారాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. సినిమా రివ్యూలు, సినిమాలకు సంబంధించి ప్రత్యేక కథనాలు కూడా రాస్తుంటారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు. ఆయనకు జర్నలిజంలో 18 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. SIR Enumartion News: తెలంగాణ వ్యాప్తంగా SIR (స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్) కు నేడు ఆఖరు. ఇప్పటివరకు దాదాపు 78.14 శాతం ఎన్యుమరేషన్ ప్రక్రియ పూర్తయినట్టు ఎన్నికల సంఘం తెలిపింది. ఇక తెలంగాణ రాజధాని హైదరాబాద్లో చాలా తక్కువగా నమోదు అయినట్టు తెలుస్తుంది. వలన వచ్చి ఇక్కడ నివసిస్తున్న వారు తమ సొంత ఊరిలో ఓటు హక్కుకు సంబంధించిన ఫారమ్ అందజేశారు. ఈ నేపథ్యంలో చాలా మంది సొంత ప్రాంతాల్లో ఓటు హక్కును ఉంచుకున్నారు. ఈ నేపథ్యంలో హైదరాబాద్ నగరంలో భారీగా ఓటర్లు తగ్గే అవకాశాలున్నాయి. ఎన్యుమరేషన్ ప్రక్రియలో 94 % తో యాదాద్రి టాప్, 58 % తో హైదరాబాద్ లీస్ట్ ... అయితే రాష్ట్ర వ్యాప్తంగా SIR ఎన్యుమరేషన్ ప్రక్రియ కాలేదు. దీంతో మళ్లీ గడువు పొడిగిస్తారా లేదా అన్న ఉత్కంఠ నెలకొంది. ముగింపునకు సంబంధించి ఓటర్లలో తీవ్ర ఉత్కంఠ నెలకొంది. ఇప్పటికే ఎన్యుమరేషన్ గడువును భారత ఎన్నికల సంఘం రెండుసార్లు పొడిగించింది. రాష్ట్ర ఎన్నికల సంఘం కార్యాలయ వివరాల ప్రకారం నిన్నటికి రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 78.14 శాతం డిజిటలైజేషన్ పూర్తయినట్టు తెలిపింది. తెలంగాణలో భారీగా తగ్గనున్న ఓటర్లు.. రాష్ట్రంలో మొత్తం 3.38 కోట్ల ఓటర్ల ఉండగా, ఇప్పటివరకూ 2.64 కోట్ల ఓటర్ల డిజిటలైజేషన్ ప్రక్రియ పూర్తయినట్టు తెలిపారు. వీటిలో యాదాద్రి-భువనగిరి జిల్లా 94.30 శాతం డిజిటైజేషన్తో రాష్ట్రంలోనే మొదటి స్థానంలో నిలిచింది. కాగా హైదరాబాద్ జిల్లాలో డిజిటలైజేషన్ అత్యంత కనిష్ఠంగా 58.58 శాతంగా