
తెలుగు సినీ చరిత్రను పరిశీలిస్తే, వారసత్వం అనేది ఒక విడదీయరాని భాగం. తండ్రులు, కొడుకులు, సోదరుల మాదిరిగానే అక్కాచెల్లెళ్లు కూడా సినీ రంగంలో తమ అదృష్టాన్ని పరీక్షించుకోవడం సాధారణంగా కనిపిస్తుంది. చాలా సందర్భాలలో అక్కలు తొలుత హీరోయిన్లుగా అరంగేట్రం చేసి, వారికి లభించిన గుర్తింపు, అవకాశాలతో చెల్లెళ్లు కూడా పరిశ్రమలోకి అడుగు పెట్టారు. అయితే, చెల్లెళ్లు అక్కల్ని ఓవర్టేక్ చేసి, లేదా కనీసం అదే స్థాయిలో విజయం సాధించిన సందర్భాలు చాలా తక్కువ. కృష్ణకుమారి, రాధా, జ్యోతిక వంటి కొందరు మాత్రమే ఈ సాధారణ ధోరణికి భిన్నంగా నిలిచి, తమకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్నారు. ప్రముఖ నటుడు ఎం.ఆర్. రాధ కూతురైన రాధిక తమిళ సినిమాల్లో హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చి, ‘న్యాయం కావాలి’ చిత్రంతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమయ్యారు. తొలి సినిమా ఘనవిజయం సాధించడంతో ఆమె కెరీర్ సజావుగా సాగింది. గ్లామర్ పాత్రలతో పాటు నటిగా గుర్తింపు తెచ్చుకున్న రాధిక, టీవీ రంగంలో కూడా నటిగా, నిర్మాతగా కొనసాగుతున్నారు. ఆమె వైవాహిక జీవితం (ప్రతాప్ పోతన్, రిచర్డ్స్, శరత్కుమార్తో) కూడా వార్తల్లో నిలిచింది. అక్క రాధిక అండదండలతో నిరోష, ‘మహాజనానికి మరదలుపిల్ల’ చిత్రంతో తెలుగు సినిమాల్లోకి వచ్చారు. చిరంజీవి, బాలకృష్ణ వంటి స్టార్ హీరోలతో నటించినా, ఏడేళ్ల తర్వాత రాంకీని పెళ్లి చేసుకొని సినిమాలకు దూరమయ్యారు. ఆ తర్వాత తెలుగు సీరియల్స్లో రీఎంట్రీ ఇచ్చినా, అక్క రాధిక అంతటి పేరు తెచ్చుకోలేకపోయారు. [caption id="attachment_1864211" align="aligncenter" width="1024"] Radhika Nirosha[/caption] ‘పండంటి కాపురం’ చిత్రంతో పరిశ్రమలోకి అడుగుపెట్టిన జయసుధ అసలు పేరు సుజాత. ఆమె తల్లి జోగులాంబ కూడా నటి కావడమే కాకుండా, ప్రముఖ నటి విజయనిర్మలకు జయసుధ మేనకోడలు. విజయనిర్మల ప్రోత్సాహంతో అడుగుపెట్టినా, జయసుధ స్వయంకృషితో ఎదిగారు. ‘సహజ నటి’గా పేరు తెచ్చుకున్న ఆమె రెండు పెళ్లిళ్లు చేసుకున్నారు. హీరోయిన్గా, క్యారెక్టర్ ఆర్టిస్ట్గా ఆమెకు ఉన్న డిమాండ్ ప్రత్యేకమైంది. అయితే, జయసుధ