
తిరుమల: శ్రీవారి సర్వదర్శనానికి భక్తుల రద్దీ ఆదివారం కూడా కొనసాగింది. సర్వదర్శనం టోకెన్లు లేని భక్తులు వైకుంఠం క్యూకాంప్లెక్స్-1, నారాయణగిరి షెడ్లు నిండి రింగురోడ్డు, శిలాతోరణం నుంచి బాటగంగమ్మ ఆలయం వరకు క్యూలైన్లో వేచి ఉన్నారు. భక్తులను విడతలవారీగా సర్వదర్శనం క్యూలైన్లోకి అనుమతిస్తున్నారు. వీరికి 14 గంటల్లో శ్రీవారి దర్శనం లభించనుంది. క్యూలైన్లోని భక్తులకు అన్నప్రసాదాలు, తాగునీరు, పాలను శ్రీవారి సేవకులు అందిస్తున్నారు. సర్వదర్శన క్యూలైన్లను ఎప్పటికప్పుడు తితిదే ఉన్నతాధికారులు పరిశీలించి సిబ్బందికి సూచనలు అందిస్తున్నారు. రూ.300 ప్రత్యేక ప్రవేశదర్శనం టికెట్లు కలిగిన భక్తులకు మూడు గంటల్లో శ్రీవారి దర్శనం లభిస్తోంది. శ్రీవారిని శనివారం 90,293 మంది భక్తులు దర్శించుకున్నారు. హుండీ కానుకలు రూ.3.81 కోట్లు లభించాయి. వసతి గదుల కోసం రద్దీ కొనసాగుతోంది. యాత్రికుల వసతి సముదాయంలో భక్తులు కిటకిట లాడుతున్నారు. గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు. ఏపీలో ఇకపై పట్టణ, స్థానిక సంస్థల పరిధిలో ఆన్లైన్ ద్వారా అందించే పౌర సేవలకు ఇకపై ఆధార్ ఆధారిత ధ్రువీకరణ విధానం అమలు కానుంది. మున్సిపల్ సేవలను వేగంగా, సురక్షితంగా, పారదర్శకంగా అందించాలనే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. దీని కోసం కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేశారు. ఏఐ సాయంతో ఇన్విజబుల్ పోలీసింగ్ నిర్వహించనున్నారు. జగన్ అసెంబ్లీకి వస్తే డీఎస్సీతోసహా పలు అంశాలపై మంత్రులతో సమాధానాలు ఇప్పించే బాధ్యత తనదేనన్నారు స్పీకర్ అయ్యన్నపాత్రుడు. రోడ్లపై నోటికొచ్చింది మాట్లాడే బదులు సభకు వచ్చి
