
సినిమాలు కేవలం వినోదాన్ని మాత్రమే కాదు, కొందరి జీవితాల్లో బలమైన స్ఫూర్తిని నింపి, వారి గమనాన్ని నిర్దేశిస్తాయి. సరిగ్గా ఇలాంటి ఓ సంఘటనే కాక్రోచ్ జనతా పార్టీ (సీజేపీ) వ్యవస్థాపకుడు అభిజీత్ దీప్కే జీవితంలో చోటుచేసుకుంది. బాలీవుడ్ బాద్షా షారుఖ్ ఖాన్ నటించిన 'స్వదేశ్' సినిమా తనను ఎంతగా ప్రభావితం చేసిందో, ప్రజాసేవ వైపు ఎలా నడిపించిందో ఆయన తాజాగా వెల్లడించారు. ఈ స్ఫూర్తితోనే స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా తన సొంతూరులో 'స్కూల్ ఠీక్ కరో' (పాఠశాలలను బాగుచేయండి) అనే ప్రచారాన్ని ఆయన ప్రారంభించారు.మహారాష్ట్రలోని హింగోలి జిల్లాలో ఉన్న తన స్వగ్రామంలోని ప్రభుత్వ పాఠశాలలను సందర్శించి ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. పాఠశాలల్లో విద్యార్థులకు సరిపడా బెంచీలు, తాగునీటి సరఫరా, కిటికీలు, మరుగుదొడ్ల వంటి కనీస వసతుల కొరతను ఆయన ఎత్తిచూపారు. ఈ సందర్భంగా ఆయన సోషల్ మీడియా ప్లాట్ఫామ్ 'ఎక్స్'లో తన అనుభవాలను పంచుకున్నారు."చిన్నప్పటి నుంచి 'స్వదేశ్' సినిమా చూస్తూ పెరిగాను. ఆ సినిమాతో ఎంతగా ప్రేమలో పడ్డానంటే, ఇప్పటికి వందకు పైగా సార్లు చూసి ఉంటాను. అందులోని మోహన్ పాత్ర నన్ను ఎంతగానో కదిలించింది. అమెరికా నుంచి తిరిగొచ్చి సొంత గ్రామ ప్రజలకు సేవ చేయాలనే ఆలోచనకు ఆ పాత్రే స్ఫూర్తి. సినిమాలో మోహన్, హరిదాస్ అనే వ్యక్తిని కలిసినప్పుడు, అతను కుటుంబాన్ని పోషించడానికి పడుతున్న ఇబ్బందులు చూసి చలించిపోతాడు. తిరుగు ప్రయాణంలో రైల్వే స్టేషన్లో ఓ చిన్న పిల్లవాడు బడికి వెళ్లకుండా నీళ్లు అమ్ముకోవడం చూసి మోహన్ కంటతడి పెడతాడు. ఆ దృశ్యం