
దేశవ్యాప్తంగా ప్రస్తుతం అమలవుతున్న E20 పెట్రోల్ విధానంపై కేంద్ర ప్రభుత్వం కీలక పునరాలోచన చేస్తోంది. పాత వాహనాల యజమానులు ఎదుర్కొంటున్న సాంకేతిక ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని, మళ్ళీ E10 పెట్రోల్ సరఫరా చేసే అంశాన్ని పరిశీలిస్తోంది. ఇంధన దిగుమతులను తగ్గించే లక్ష్యంతో 20 శాతం ఇథనాల్ కలిపిన ఇంధనాన్ని ప్రభుత్వం ప్రవేశపెట్టినప్పటికీ, సామాన్యుల నుంచి వస్తున్న విజ్ఞప్తులతో ఇప్పుడు ఈ చర్చలు మొదలయ్యాయి. భారత్ తన ఇథనాల్ బ్లెండెడ్ పెట్రోల్ కార్యక్రమ లక్ష్యాలను నిర్దేశిత సమయం కంటే ముందే పూర్తి చేసింది. గత ఏడాది నుంచే ఈ ప్రక్రియ వేగవంతం కాగా, 2026 ఏప్రిల్ నాటికి దేశంలోని అన్ని పెట్రోల్ బంకుల్లో E20 ఇంధనం మాత్రమే అందుబాటులోకి వచ్చింది. అయితే, పాత కాలపు వాహనాలు, ముఖ్యంగా కార్బ్యురేటర్ ఆధారిత ద్విచక్ర వాహనాల ఇంజిన్లపై ఈ ఇంధన ప్రభావం ఎక్కువగా ఉందనే ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. దీంతో సుమారు 75 నుంచి 80 కోట్ల పాత ద్విచక్ర వాహనాల యజమానులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ వాహనాల్లోని రబ్బరు సీల్స్, గాస్కెట్లు అధిక ఇథనాల్ను తట్టుకోలేక పాడవుతున్నాయని మెకానిక్లు చెబుతున్నారు. ఇదిలా ఉండగా, ప్రభుత్వ అంచనాల ప్రకారం E20 వాడకం వల్ల పాత వాహనాల మైలేజీలో సుమారు 3 నుంచి 5 శాతం మేర తగ్గుదల నమోదవుతోంది. ముఖ్య ఆర్థిక సలహాదారు వి. అనంత నాగేశ్వరన్ కూడా ఈ సమస్యపై సానుకూలంగా స్పందించారు. పాత వాహనాల కోసం మళ్ళీ E10 పెట్రోల్ను అందుబాటులోకి తెస్తే బాగుంటుందని ఆయన అభిప్రాయపడ్డారు. ఫలితంగా ప్రజలపై ఆర్థిక భారం తగ్గుతుందని, కొత్త వాహనాలు కొనుగోలు చేసే వరకు పాత వాహనదారులకు ఇది పెద్ద ఊరట అవుతుందని ఆయన సూచించారు. ఈ నేపథ్యంలో కేంద్రం ఇప్పుడు రెండు రకాల ఇంధనాల సరఫరాపై ప్రాథమిక చర్చలు జరుపుతోంది. అయితే, దేశవ్యాప్తంగా ఉన్న 1 లక్షకు పైగా పెట్రోల్ బంకుల్లో రెండు రకాల ఇంధన సరఫరా