
దార్ల హరీశ్.. జీ తెలుగు న్యూస్లో సీనియర్ కంటెంట్ ఎడిటర్గా పనిచేస్తున్నాను. నా 8 ఏళ్ల అనుభవంలో ఈనాడు వంటి ప్రముఖ దినపత్రికతో పాటు ఈటీవీ భారత్లో పనిచేశాను. 2025 నుంచి ఎంటర్టైన్మెంట్, బిజినెస్, టెక్నాలజీ, హెల్త్, క్రీడలు, రాజకీయాలు వంటి వాటికి సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో పనిచేసిన అనుభవం కలదు. England Vs India 4th T20i Preview: ఇంగ్లాండ్తో జరిగిన టీ20 సిరీస్లోని తొలి మూడు మ్యాచ్ల్లో రెండు ఘోర పరాజయాల తర్వాత పరువు నిలుపుకోవాలి టీమ్ఇండియా భావిస్తోంది. ఇప్పటికే సిరీస్ ఆశలు కోల్పోయిన భారత జట్టు ఇప్పుడు ఎట్టిపరిస్థితుల్లో మిగిలిన రెండు టీ20 మ్యాచ్ల్లో విజయం సాధించి సిరీస్ను సమం చేయాలని చూస్తోంది. అయితే ఈ నాలుగో మ్యాచ్కు సంబంధించి టీమ్ఇండియా కూర్పులో పెద్ద గందరగోళం ఏర్పడింది. ఇప్పటికే అనుభవజ్ఞుడైన సంజూ శాంసన్ను పక్కకు తప్పించి అతడి స్థానంలో వైభవ్ సూర్యవంశీని జట్టులోకి తీసుకోగా.. అతని ప్రభావం పెద్దగా చూపలేకపోవడంతో భారత ఫ్యాన్స్ నిరాశకు గురయ్యారు. అయితే భారత జట్టు ఇప్పటికే 0-2 తేడాతో సిరీస్ చేజారే పరిస్థితి నెలకొన్న నేపథ్యంలో కోచ్ గౌతమ్ గంభీర్ కీలక నిర్ణయం తీసుకుంటారని తెలుస్తోంది. అయితే ఇప్పటికే ఐర్లాండ్తో జరిగిన టీ20 సిరీస్లో ఓటమి తర్వాత ఇప్పుడు ఇంగ్లాండ్ సిరీస్ కూడా కోల్పోతే డిఫెండింగ్ ఛాంపియన్గా నిలిచిన టీమ్ఇండియాకు పెద్ద అవమానం అనే చెప్పాలి. అయితే ఇంగ్లాండ్, ఐర్లాండ్ పర్యటనల్లో జట్టు కూర్పుపై సెలెక్షన్ కమిటీ, మేనేజ్మెంట్పై భారత ఫ్యాన్స్ తీవ్ర నిరాశలో మునిగిఉన్నారు. భారత జట్టు పరిస్థితి ఇదే! తాజాగా ఇంగ్లాండ్తో జరిగిన మూడో టీ20లో భారత జట్టు 125 పరుగుల ఘోర పరాజయం తర్వాత భారత అభిమానులు.. "We Want Sanju" (మాకు సంజూ కావాలి) అంటూ నినాదాలు చేయడం గమనార్హం. దీంతో పాటు టీ20 ప్రపంచకప్లో భారత జట్టును విజయతీరాలకు చేర్చడంలో కృషి