
అల్లు అర్జున్ వరుసగా అట్లీ, లోకేష్ కనగరాజ్, బాసిల్ జోసెఫ్లతో సినిమాలు చేస్తున్నారు. భారీ పాన్ ఇండియా ప్రాజెక్టులతో బన్నీ డైరీ 2028 వరకు ఫుల్గా బిజీగా మారింది. 'పుష్ప' సిరీస్తో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ (Allu Arjun) క్రేజ్ పాన్ ఇండియా సరిహద్దులు దాటి ప్రపంచ వ్యాప్తంగా మారు మోగిపోయింది. తగ్గేదేలే అంటూ బాక్సాఫీస్ వద్ద రికార్డుల సునామీ సృష్టించిన బన్నీ.. ఇప్పుడు తన తదుపరి సినిమాలను కూడా అదే రేంజ్లో, ఊహించని కాంబినేషన్లలో లైనప్ చేస్తున్నారు. ప్రస్తుతం బన్నీ ప్లాన్ చేసిన ప్రాజెక్ట్లు, లైనప్ చూస్తుంటే మైండ్ బ్లాంక్ అవ్వాల్సిందే. అయితే ఈ బిజీ లైనప్ వల్ల టాలీవుడ్లో ఒక ఆసక్తికరమైన చర్చ నడుస్తోంది. ప్రస్తుతం ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ అట్లీ (Atlee) దర్శకత్వంలో రాకా (Raaka) అనే భారీ ప్రాజెక్ట్ చేస్తున్నారు. ఈ ఇద్దరి కాంబినేషన్ అనౌన్స్ అయినప్పటి నుంచే అభిమానుల్లో, ఇండస్ట్రీ వర్గాల్లో అంచనాలు ఆకాశాన్ని తాకాయి. ప్రముఖ నిర్మాణ సంస్థ సన్ పిక్చర్స్ (Sun Pictures)ఈ చిత్రాన్ని ఏకంగా 1000 కోట్ల భారీ బడ్జెట్తో నిర్మిస్తున్నట్లు టాక్. హాలీవుడ్ యాక్షన్ చిత్రాలకు ఏమాత్రం తీసిపోని విధంగా, కళ్లు చెదిరే విజువల్ ఎఫెక్ట్స్, గ్రాఫిక్స్, మైండ్ బ్లోయింగ్ యాక్షన్ సీక్వెన్సులతో ఈ సినిమాను రూపొందిస్తున్నారు. ఈ ఏడాది చివరినాటికి షూటింగ్ పూర్తి చేసి, 2027లో ఈ చిత్రాన్ని గ్రాండ్గా థియేటర్లలోకి తీసుకురావడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఇక ఈ సినిమాలో బాలీవుడ్ క్వీన్ దీపికా పడుకోణె (Deepika Padukone) కథానాయికగా నటిస్తుండగా.. జాన్వీ కపూర్ (Janhvi Kapoor), నేషనల్ క్రష్ రష్మిక మందన్న (Rashmika Mandanna)లు కీలక పాత్రల్లో అలరించబోతున్నారనే వార్త టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీగా మారింది. రాకా సినిమా పూర్తయిన వెంటనే, బన్నీ మరో తమిళ విలక్షణ దర్శకుడు లోకేష్ కనగరాజ్తో తన 'AA23' ప్రాజెక్ట్ను పట్టాలెక్కించనున్నారు. మైత్రీ మూవీ