
డీఎంకేలో చేరితే రూ.50 కోట్లు ఇవ్వడంతోపాటు తమ ప్రభుత్వం వచ్చాక మంత్రి పదవి కూడా ఇస్తామని ఆ పార్టీ నేతలు తన ను ప్రలోభాలకు... చెన్నై, జూలై 6(ఆంధ్రజ్యోతి): డీఎంకేలో చేరితే రూ.50 కోట్లు ఇవ్వడంతోపాటు తమ ప్రభుత్వం వచ్చాక మంత్రి పదవి కూడా ఇస్తామని ఆ పార్టీ నేతలు తనను ప్రలోభాలకు గురిచేశారని తమిళనాడులోని అధికార పార్టీ టీవీకేకు చెందిన శ్రీవైకుంఠం ఎమ్మెల్యే విజయ్ శరవణన్ సంచలన ఆరోపణలు చేశారు. డీఎంకే మాజీ మంత్రి అనితా రాధాకృష్ణన్ అనుచరులు తనకు ఫోన్చేసి బేరసారాలు జరిపారని, ప్రలోభాలకు లొంగకపోవడంతో తనను తీవ్రంగా బెదిరించారని చెప్పారు. అప్పటికీ లొంగకపోవడంతో సామాజిక మాధ్యమాల్లో తనపై రకరకాల ప్రచారం చేస్తున్నారన్నారు. వారు తనతో మాట్లాడిన ఆడియో క్లిప్పింగును మీడియాకు వినిపించారు. తమిళనాడులోని విజయ్ ప్రభుత్వాన్ని కూల్చేందుకు కుట్ర జరిగిందన్న ఆరోపణపై పోలీసులు ఇప్పటికే 9మందిని అరెస్టు చేశారు. మెట్రో ఫేజ్-2పై కేంద్రమంత్రులకు సీఎం రేవంత్రెడ్డి లేఖ కన్నెపల్లి పంపు దగ్గరకెళ్లి కేటీఆర్ నాటకమాడుతున్నారు.. మంత్రి ఉత్తమ్ సెటైర్లు