Tata Car Price Increase September 1: కొత్తగా కార్లు కొనుగోలు చేయాలనుకునే వారికి భారీ షాకులు తగులుతున్నాయి. దిగ్గజ కార్ల తయారీ సంస్థలు వరుసగా కార్ల ధరల్ని పెంచుతుండటమే కారణం. ఇప్పటికే మారుతీ సుజుకీ, హ్యుందాయ్ మోటార్ ఇండియా కార్ల ధరల పెంపుపై ప్రకటన చేయగా, తాజాగా టాటా గ్రూప్ దిగ్గజ సంస్థ టాటా మోటార్స్ ప్యాసింజర్ వెహికిల్స్ కూడా ధరల్ని పెంచుతున్నట్లు ( Tata Motors Car Price Hike) ప్రకటన చేసింది. తమ కార్లు, SUV లపై ఎంపిక చేసిన మోడళ్లు, వేరియంట్లను బట్టి గరిష్ఠంగా రూ. 25 వేల వరకు పెంచుతామని స్పష్టం చేసింది. ఈ కొత్త సవరించిన ధరలు సెప్టెంబర్ 1 నుంచి అమల్లోకి వస్తాయని పేర్కొంది.అంతర్జాతీయంగా నెలకొన్న భౌగోళిక, రాజకీయ అనిశ్చితి కారణంగా ముడి సరకులు, ఇతర కమొడిటీ ధరలు పెరుగుతున్న తరుణంలో ధరల్ని తప్పక పెంచాల్సిన పరిస్థితులు నెలకొన్నాయని టాటా మోటార్స్ ఒక ప్రకటనలో తెలిపింది. ధరల పెంపు తమ అన్ని రకాల వాహనాలపై (పోర్ట్ఫోలియో) వర్తిస్తుందని, అయితే మోడల్, వేరియంట్ను బట్టి ధరల పెంపులో తేడా ఉంటుందని వివరించింది. ఇది ఇంటర్నల్ కంబషన్ ఇంజిన్ (ICE), ఎలక్ట్రిక్ వెహికిల్స్ (EV) రెండింటిపైనా ఉంటుందని స్పష్టం చేసింది. ద్రవ్యోల్బణం పెరుగుతుండటం కూడా ఇక్కడ ధరల పెంపునకు ప్రధాన కారణంగా ఉందని చెబుతోంది.టాటా మోటార్స్ ఈ త్రైమాసికంలోనే ఏకంగా రెండు సార్లు ధరల పెంపును ప్రకటించడం ఆందోళన కలిగిస్తోంది. ఇప్పటికే జూన్ నెలలో ఒకసారి తమ ప్యాసింజర్ వాహనాల ధరల్ని 1.5 శాతం వరకు పెంచుతున్నట్లు ప్రకటించింది. అది జులై 1 నుంచి అమల్లోకి వచ్చింది. దీంతో కొంత కాలంగా ధరలు భారీగా పెరుగుతున్నాయని అర్థం చేసుకోవచ్చు. గతేడాది జీఎస్టీ సంస్కరణలతో కార్ల ధరలు భారీగా తగ్గగా, మళ్లీ ధరల పెంపుతో ఆ స్థాయికే చేరుతున్నట్లు తెలుస్తోంది.Read Also: జులైలో అత్యధికంగా అమ్ముడుబోయిన కార్లు ఇవే
Actor ProfilePolitician
టాటా కార్ల ధరలు మరింత ప్రియం.. ఏకంగా రూ. 25 వేల వరకు జంప్.. సెప్టెంబర్ 1 నుంచే
📊 Box Office Collections
Total News1
Movie Updates0
Sources1
Samayam Telugu•25 Jan 2027
టాటా కార్ల ధరలు మరింత ప్రియం.. ఏకంగా రూ. 25 వేల వరకు జంప్.. సెప్టెంబర్ 1 నుంచే