
జమ్మూకశ్మీర్ రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కాయి. తమ ప్రభుత్వాన్ని అస్థిరపరిచేందుకు కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ‘ఆపరేషన్ లోటస్’కు తెరలేపిందని, తమ ఎమ్మెల్యేలను కొనుగోలు చేసేందుకు ప్రయత్నిస్తోందని ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా సంచలన ఆరోపణలు చేశారు. శనివారం శ్రీనగర్లోని హజ్రత్బాల్లో జరిగిన ఓ బహిరంగ సభలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.ఒమర్ అబ్దుల్లా మాట్లాడుతూ.. "బీజేపీకి చెందిన ఓ కీలక నేత, సుప్రీంకోర్టు న్యాయవాది మా పార్టీ ఎమ్మెల్యేను రహస్యంగా కలిశారు. పార్టీ మారితే రూ.20 కోట్ల నుంచి రూ.30 కోట్ల నగదు, మంత్రి పదవి ఇస్తామని, జమ్మూ కశ్మీర్కు పూర్తి రాష్ట్ర హోదా కల్పిస్తామని ఆశ చూపారు. కానీ మా ఎమ్మెల్యేల విశ్వాసాన్ని, నిబద్ధతను వారు కొనలేకపోయారు. రూ.100 కోట్లు ఇచ్చినా నేషనల్ కాన్ఫరెన్స్ నేతలు అమ్ముడుపోరు. బలహీనులుగా భావించి వెనుక ద్వారం గుండా అధికారంలోకి రావాలని బీజేపీ చూస్తోంది" అని తీవ్రంగా విమర్శించారు.ఒమర్ ఆరోపణలను బీజేపీ జమ్మూకశ్మీర్ సీనియర్ నేత రవీందర్ రైనా ఖండించారు. ఈ వ్యాఖ్యలు పూర్తిగా నిరాధారమైనవని, భ్రమ కలిగించేలా ఉన్నాయని కొట్టిపారేశారు. కేంద్రం నిధులు ఇవ్వకపోతే ఉద్యోగులకు జీతాలు కూడా చెల్లించలేమని కొద్దిరోజుల క్రితం స్వయంగా ముఖ్యమంత్రే అన్న విషయాన్ని రైనా గుర్తుచేశారు. ప్రస్తుతం 90 స్థానాలున్న అసెంబ్లీలో 41 మంది ఎమ్మెల్యేలతో నేషనల్ కాన్ఫరెన్స్ బలంగా ఉంది. కాంగ్రెస్ (6), స్వతంత్రులు (5), సీపీఎం (1) బయటి నుంచి మద్దతు ఇస్తుండటంతో ఒమర్ ప్రభుత్వానికి ఎలాంటి ప్రమాదం లేదు.రాష్ట్ర హోదా కోసం ఢిల్లీలో పోరాటంమరోవైపు, జమ్మూకశ్మీర్కు రాష్ట్ర హోదా పునరుద్ధరణపై