
Telugu Times•26 Jan 2027
జగన్ ప్రభుత్వంలో అమర్ నాథ్ గౌడ్ వంటి ఎందరో అమాయకుల్నివైసీపీ ప్రభుత్వంలో బీసీ (BC)లను హత్యలు చేయించిన చరిత్ర జగన్ (Jagan)దని శాసనమండలి చీఫ్ విప్ పంచుమర్తి అనురాధ (Panchumarthi Anuradha) ధ్వజమెత్తారు. స్థానిక సంస్థల్లో రిజర్వేషన్లు తగ్గించి బీసీలను అణగదొక్కడానికి ప్రయత్నించారని మండిపడ్డారు. కూటమి ప్రభుత్వం వచ్చాక రిజర్వేషన్ల పెంపుతో బలహీన వర్గాలకు మేలు జరుగుతోందన్నారు. అసెంబ్లీ మీడియా పాయింట్లో ఆమె మాట్లాడారు. ఎన్టీఆర్ (NTR) మొదలు చంద్రబాబు (Chandrababu), లోకేశ్ (Lokesh) వరకూ బీసీలకు తొలి ప్రాధాన్యమిచ్చారు. వారి అభ్యున్నతికి అనేక సంక్షేమ పథకాలు అమలు చేశారు. జగన్ ప్రభుత్వంలో అమర్నాథ్గౌడ్ వంటి ఎందరో అమాయకుల్ని పొట్టనపెట్టుకున్నారు. అప్పట్లో తాడేపల్లి ప్యాలెస్కు కూతవేటు దూరంలో మహిళ మీద అత్యాచారాలు జరిగినా ఆయన కనీసం స్పందించలేదు అని మండిపడ్డారు