
డీఎస్సీ (DSC) అంశంపై ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మరోసారి వేడి పెరిగింది. మాజీ ముఖ్యమంత్రి, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి (Y. S. Jagan Mohan Reddy)తో ఈ అంశంపై బహిరంగ చర్చకు తాను సిద్ధంగా ఉన్నానని మంత్రి నారా లోకేశ్ (Nara Lokesh) మరోసారి స్పష్టం చేశారు. జగన్ తన సవాల్ను స్వీకరించే వరకు తాను ఎదురుచూస్తున్నాననే భావనతో ఆయన ‘ఎక్స్’ (X) వేదికగా చేసిన పోస్టు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్గా మారింది. మంగళవారం ఉదయం లోకేశ్ చేసిన ఈ పోస్టులో ఓ ఫన్నీ మీమ్ను కూడా జత చేశారు. డీఎస్సీపై జగన్తో చర్చకు తాను సిద్ధంగా ఉన్నానని చెబుతూ వరుసగా రెండో రోజు సవాల్ విసరడం రాజకీయంగా ఆసక్తిని పెంచింది. పోస్టు చేసిన కొద్ది గంటల్లోనే నెటిజన్ల నుంచి భారీ స్పందన రావడం గమనార్హం. పలువురు రీపోస్టులు చేయగా, వేలాది మంది లైకులు కొట్టారు. మరికొందరు కామెంట్ల ద్వారా తమ అభిప్రాయాలను వెల్లడించారు. డీఎస్సీ నియామకాలు, విద్యా రంగానికి సంబంధించిన అంశాలపై వైసీపీ అధినేత చేస్తున్న విమర్శలకు సమాధానం ఇచ్చేందుకు తాను సిద్ధంగా ఉన్నానని లోకేశ్ ఇప్పటికే అసెంబ్లీలో ప్రకటించారు. సోమవారం అసెంబ్లీ సమావేశాల సందర్భంగా ఆయన జగన్కు బహిరంగ చర్చకు రావాలని సవాల్ చేశారు. గతంలో కూడా పలుమార్లు ఇదే విధంగా ఆహ్వానించినప్పటికీ జగన్ స్పందించలేదని మంత్రి ఆరోపించారు. అసెంబ్లీ లోపలైనా, బయటైనా చర్చకు సిద్ధమని లోకేశ్ చెబుతుండటంతో ఈ వ్యవహారం రాజకీయ చర్చకు కేంద్రంగా మారింది. ఒకవైపు ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలను లోకేశ్ సమర్థిస్తుండగా, మరోవైపు డీఎస్సీపై వైసీపీ నుంచి వస్తున్న విమర్శలకు నేరుగా సమాధానం చెప్పేందుకు ఆయన సిద్ధపడుతున్నారని టీడీపీ వర్గాలు చెబుతున్నాయి. అయితే లోకేశ్ వరుస సవాళ్లపై జగన్ నుంచి ఇప్పటివరకు ప్రత్యక్ష స్పందన రాకపోవడం చర్చనీయాంశంగా మారింది. గతంలో కూడా ఇలాంటి పరిస్థితుల్లో వైసీపీ నేతలు స్పందించారు. తమ పార్టీ అధినేత