
Zee Telugu•22 Nov 2026
చార్మినార్ ను గోల్డెన్ టెంపుల్ గా మారుస్తాం.. బోనాల వేడుకల్లో కేంద్ర మంత్రి బండి సంజయ్Bandi Sanjay: హైదరాబాద్ వ్యాప్తంగా ఎక్కడ చూసిన బోనాలు సంబరాలు కన్పిస్తున్నాయి. ఈ నేపథ్యంలో కేంద్రమంత్రి బండి సంజయ్ ఓల్డ్ సిటీలోని లాల్ దర్వాజ సింహవాహిని అమ్మవారి బొనాల్లో పాల్గొన్నారు. కాంగ్రెస్, బీఆర్ఎస్ పాలనలో ఆలయ నిధుల కేటాయింపుల్లో అన్యాయం జరిగిందన్నారు. లాల్ దర్వాజ ఉజ్జయిని మహంకాళి ఆలయంకు రూ.20 కోట్లు ఇస్తానని కేసీఆర్ మోసం చేశారన్నారు. లాల్ దర్వాజ బోనాల నిర్వహణకు కాంగ్రెస్ ప్రభుత్వం రూ.5.50 లక్షలు మాత్రమే కేటాయించిందన్నారు. అలాగే ఛార్మినార్ వద్ద ఉన్న భాగ్యలక్ష్మి అమ్మవారి ఆలయాన్ని గోల్డెన్ టెంపుల్ తరహాలో తీర్చిదిద్దుతామని బండి సంజయ్ తెల్చి చెప్పారు