
టాటా గ్రూప్లో 40 ఏళ్ల వృత్తి జీవితం గడిపి, తొమ్మిదేళ్ల పాటు టాటా సన్స్ ఛైర్మన్గా వ్యవహరించిన నటరాజన్ చంద్రశేఖరన్ (63) అతి త్వరలో గ్రూప్ను వీడనున్నారు. ఛైర్మన్గా మూడోవిడతలో ఐదేళ్లపాటు చంద్రశేఖరన్ను కొనసాగించాలని సర్ దొరాబ్జీ టాటా ట్రస్ట్, సర్ రతన్ టాటా ట్రస్ట్ ఏకగ్రీవంగా తీర్మానించినా.. టాటా సన్స్ బోర్డు ఇప్పటివరకు ఏమీ తేల్చలేదు. టాటా సన్స్లో ఈ ట్రస్టులకు 51.54% వాటా ఉంది. అయితే టాటా గ్రూప్నకు ఎంతో కీలకమైన టాటా సన్స్ ఛైర్మన్గా తనకు ఏకగ్రీవ మద్దతు లభించకపోవడం వల్లే వైదొలగనున్నట్లు చంద్రశేఖరన్ బుధవారం ప్రకటించారు. టాటా సన్స్ ఛైర్మన్గా రెండో విడత పదవీ కాలం 2027 ఫిబ్రవరి 20తో ముగియనున్నందున, తన వారసుడి నియామకంపై బోర్డు దృష్టి పెట్టాలని ఆయన కోరారు. చంద్రశేఖరన్, టాటా గ్రూప్ నుంచి వైదొలగనున్నారనే వార్తతో బుధవారం గ్రూప్ కంపెనీల షేర్లు 3.7% వరకు నష్టపోయాయి. వాటి మార్కెట్ విలువ రూ.45,000 కోట్లకు పైగా తగ్గింది. టాటా సన్స్ వాటాదార్ల సాధారణ సమావేశం ఈ నెల 18న జరగనుంది. అంతకుముందుగానే చంద్రశేఖరన్ తన నిర్ణయం ప్రకటించడం గమనార్హం. టాటా గ్రూప్ హోల్డింగ్ సంస్థ అయిన టాటా సన్స్కు తొమ్మిదేళ్లుగా (2017 నుంచి) ఛైర్మన్గా వ్యవహరిస్తున్న నటరాజన్ చంద్రశేఖరన్ (63).. గ్రూప్ నుంచి వైదొలగనున్నట్లు ప్రకటించడం సంచలనమే అయ్యింది. గతంలో రతన్టాటా నేతృత్వంలో సైరస్ మిస్త్రీని టాటా సన్స్ ఛైర్మన్ బాధ్యతల నుంచి సంస్థే తప్పించగా, ఇప్పుడు తనను ఛైర్మన్ పదవిలో కొనసాగించేందుకు బోర్డు ఏకగ్రీవ మద్దతు లభించలేదనే ఆవేదనతో చంద్రశేఖరన్ తప్పుకుంటున్నారు. ఈ వ్యవహారాలను పరిశీలిస్తే.. టాటా గ్రూప్ హోల్డింగ్ సంస్థ అయిన టాటా సన్స్లో, గ్రూప్లోని దాతృత్వ సంస్థ (ట్రస్టు)లకు 66% వాటా ఉంది. గ్రూప్ పాలనపై ట్రస్టుల ప్రభావమే ఎక్కువ. బోర్డు సభ్యుల మధ్య సంఘర్షణ ఇక్కడే ప్రారంభమైంది. తన రాజీనామాపై చంద్రశేఖరన్ మాటల్లో చెప్పాలంటే.. ‘సర్ దొరాబ్జీ టాటా