
సీనియర్ ఎన్టీఆర్ తెలుగు దేశం పార్టీని స్థాపించాడు. ఆ సమయంలో ఎన్టీఆర్తోనే ఉన్నాడు మోహన్ బాబు. ఆయన్ని నటుడిగా ప్రోత్సహించడమే కాదు, రాజకీయంగానూ లైఫ్ ఇచ్చాడు. కానీ మోహన్ బాబు ఎన్టీఆర్కే వెన్నుపోటు పొడిచాడు. ఆయనకు ద్రోహం చేశాడు. చంద్రబాబు చెప్పిన మాట విని రామారావుని మోసం చేశాడట. ఈ విషయాన్ని బాలయ్య ముందు ఒప్పుకున్నారు మోహన్బాబు. అంతేకాదు తాను తప్పు చేశానని, అదే సమయంలో చంద్రబాబు మిస్టేక్ చేసినట్టు తెలిపారు. మరి ఆ కథేంటంటే? ఎన్టీఆర్ టీడీపీని స్థాపించిన విషయం తెలిసిందే. పార్టీని స్థాపించిన తొమ్మిది నెలల్లోనే ఆయన అధికారంలోకి వచ్చారు. ముఖ్యమంత్రిగా అనేక విప్లవాత్మక మార్పులు, పథకాలు తీసుకొచ్చారు. జనం మెప్పించిన సీఎం అనిపించుకున్నారు. ఇప్పటికీ రామారావు ప్రవేశపెట్టిన పథకాలే అమలు అవుతున్నాయంటే అతిశయోక్తి కాదు. రెండు రూపాయలకే రేషన్ బియ్యం అనేది ఆయన తెచ్చిన పథకమే. సీఎంగా రాణించిన క్రమంలోనే ఆయన్ని టీడీపీలో కొందరు వెన్నుపోటు పొడిచారు. రెండు సార్లు సీఎం పీఠం నుంచి దించారు. పార్టీ, అధికారం అంతా లక్ష్మీ పార్వతి చేతుల్లోకి వెళ్తుందని, ఇకపై ఆమె చెప్పినట్టే మనం నడుచుకోవాల్సి వస్తుందని చెప్పి, చంద్రబాబు సమక్షంలోని మేజర్ గా ఎమ్మెల్యేలు తిరుగుబాటు చేశారు. ఎన్టీఆర్కి వ్యతిరేకంగా పార్టీని చీల్చి అధికారం చేపట్టారు. దీంతో రామారావు చాలా బాధపడ్డారు. తనకు వెన్నుపోటు పోవడంపై ఆయన చాలా కుంగిపోయారు. ఆ తర్వాత టీడీపీ పూర్తిగా చంద్రబాబు నాయుడి కంట్రోల్లోకి వెళ్లింది. నందమూరి ఫ్యామిలీ కూడా చంద్రబాబు వెంటనే ఉన్నారు. సొంత తండ్రినే దూరం పెట్టారు. అయితే ఈ విషయంలో భిన్న వాదనలు ఉన్నాయి. ఎన్టీఆర్కి చంద్రబాబు వెన్నుపోటు పొడిచాడని కొందరు అంటుంటే, లక్ష్మీ పార్వతి కారణంగా పార్టీని కాపాడుకోవడం కోసం చంద్రబాబు అలా చేయాల్సి వచ్చిందనేది మరికొందరి వాదన. బాలయ్య కూడా దీన్నే సమర్థిస్తుంటారు. అందుకే బావ సైడ్ ఉన్నాడు. అయితే ఇదే విషయం బాలకృష్ణ, మోహన్ బాబు మధ్య