
Unsung heroes of India| ఇంటర్నెట్డెస్క్: భారత్ స్వాతంత్ర్యం సాధించుకోవడం ఓ ఎత్తు.. దానిని కంటికి రెప్పలా కాపాడుకోవడం మరో ఎత్తు. అవకాశం దొరికినప్పుడల్లా భారత్ను నాశనం చేయడానికి పాక్ ప్రయత్నిస్తూనే ఉంది. ఈ క్రమంలో భారత్-పాక్కు మధ్య మూడు యుద్ధాలు జరిగాయి. వీటిల్లో భారత త్రివిధ దళాలు, పోలీసులు, పౌరులు ఎన్నో త్యాగాలు చేసి భరతమాతకు విజయాన్ని అందించారు. వారిలో కొందరు హీరోలు తమ ప్రాణాలను పణంగా పెట్టి పాక్ను దెబ్బతీశారు. మూడు యుద్ధాలకు సంబంధించి అలాంటి యోధుల గురించి తెలుసుకుందాం.. 1947లో భారత్కు స్వాతంత్ర్యం వచ్చిన వెంటనే.. జమ్మూకశ్మీర్ విలీనం కాలేదు. ఆ ప్రాంత రాజు హరిసింగ్ విలీనానికి అంత సుముఖంగా లేరు. మరోవైపు ఇదే అవకాశంగా తీసుకున్న పాక్.. జమ్మూకశ్మీర్ ఆక్రమణ కోసం 1947 అక్టోబర్ 22న దాడులు మొదలుపెట్టింది. పష్తూన్ తెగ ఆదివాసుల ముసుగులో సైనికులను కూడా పంపింది. దీంతో వారు వేగంగా ముజఫరాబాద్, బారాముల్లా నగరాలను స్వాధీనం చేసుకున్నారు. మరోవైపు విలీనపత్రంపై రాజా హరిసింగ్ సంతకం చేయడంలో జాప్యం కావడంతో భారత్ సైన్యాన్ని పంపడం సాధ్యం కాలేదు. మరోవైపు అప్పటి నేషనల్ కాన్ఫరెన్స్ పార్టీ సభ్యుడైన 19 ఏళ్ల యువకుడు ముక్బూల్ షేర్వానీ దాదాపు 22 మంది వాలంటీర్లతో కలిసి స్థానికులను అప్రమత్తం చేశాడు. పాక్ కిరాయి దళాలు శ్రీనగర్వైపు వస్తుండటంతో అతడు తన బైక్పై వారున్న ప్రాంతానికి చేరుకున్నాడు. భారత్ దళాలు శ్రీనగర్కు చేరుకున్నాయనే వార్తను కిరాయి దళాల్లో వ్యాప్తి చేశాడు. వారు శ్రీనగర్ వైపు వెళ్లకుండా దాదాపు నాలుగు రోజులపాటు దారితప్పించి తిప్పాడు. అతడితోపాటు ఉన్న వాలంటీర్లు శ్రీనగర్ వెళ్లే మార్గంలో అడ్డంకులు సృష్టించారు. కిరాయి మూకలు శ్రీనగర్ విమానాశ్రయం చేరితే.. భారత దళాలు అక్కడికి రావడం కష్టమైపోయేది. ఈ ప్రయత్నమే అప్పట్లో శ్రీనగర్ను పాక్ బారినపడకుండా చేసింది. 26వ తేదీన కశ్మీర్ మహారాజు విలీన పత్రంపై సంతకం చేయడంతో.. భారత సైన్యం శ్రీనగర్